బ్యాంకాక్లో కాల్పుల ఘటన.. పౌరులకు యూఏఈ సలహా
- October 04, 2023
యూఏఈ: థాయ్లాండ్ రాజధాని నగరాన్ని కుదిపేసిన మాల్లో కాల్పుల ఘటనతో బ్యాంకాక్లోని యూఏఈ ఎంబసీ మంగళవారం ఒక సలహా జారీ చేసింది. ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఎమిరాటీలందరూ సురక్షితంగా ఉన్నారని చెప్పింది. ఈ ఘటనలో కనీసం ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. సాయంత్రం 4.30 గంటలకు (0930 GMT) కాల్పుల ఘటన చోటుచేసుకున్నది. దీంతో వందలాది మంది ప్రజలు బ్యాంకాక్ నడిబొడ్డున ఉన్న సియామ్ పారాగాన్ మాల్ నుండి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి 14 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు థాయ్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు జారీ చేసిన అన్ని భద్రతా సూచనలను పాటించాలని యూఏఈ ఎంబసీ నగరంలోని పౌరులకు పిలుపునిచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే హాట్లైన్ 0097180024ను సంప్రదించాలని ఎమిరాటీస్ను కోరింది.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









