బ్యాంకాక్లో కాల్పుల ఘటన.. పౌరులకు యూఏఈ సలహా
- October 04, 2023
యూఏఈ: థాయ్లాండ్ రాజధాని నగరాన్ని కుదిపేసిన మాల్లో కాల్పుల ఘటనతో బ్యాంకాక్లోని యూఏఈ ఎంబసీ మంగళవారం ఒక సలహా జారీ చేసింది. ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఎమిరాటీలందరూ సురక్షితంగా ఉన్నారని చెప్పింది. ఈ ఘటనలో కనీసం ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. సాయంత్రం 4.30 గంటలకు (0930 GMT) కాల్పుల ఘటన చోటుచేసుకున్నది. దీంతో వందలాది మంది ప్రజలు బ్యాంకాక్ నడిబొడ్డున ఉన్న సియామ్ పారాగాన్ మాల్ నుండి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి 14 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు థాయ్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు జారీ చేసిన అన్ని భద్రతా సూచనలను పాటించాలని యూఏఈ ఎంబసీ నగరంలోని పౌరులకు పిలుపునిచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే హాట్లైన్ 0097180024ను సంప్రదించాలని ఎమిరాటీస్ను కోరింది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు







