బ్యాంకాక్లో కాల్పుల ఘటన.. పౌరులకు యూఏఈ సలహా
- October 04, 2023
యూఏఈ: థాయ్లాండ్ రాజధాని నగరాన్ని కుదిపేసిన మాల్లో కాల్పుల ఘటనతో బ్యాంకాక్లోని యూఏఈ ఎంబసీ మంగళవారం ఒక సలహా జారీ చేసింది. ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఎమిరాటీలందరూ సురక్షితంగా ఉన్నారని చెప్పింది. ఈ ఘటనలో కనీసం ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. సాయంత్రం 4.30 గంటలకు (0930 GMT) కాల్పుల ఘటన చోటుచేసుకున్నది. దీంతో వందలాది మంది ప్రజలు బ్యాంకాక్ నడిబొడ్డున ఉన్న సియామ్ పారాగాన్ మాల్ నుండి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి 14 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు థాయ్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు జారీ చేసిన అన్ని భద్రతా సూచనలను పాటించాలని యూఏఈ ఎంబసీ నగరంలోని పౌరులకు పిలుపునిచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే హాట్లైన్ 0097180024ను సంప్రదించాలని ఎమిరాటీస్ను కోరింది.
తాజా వార్తలు
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!









