బ్యాంకాక్‌లో కాల్పుల ఘటన.. పౌరులకు యూఏఈ సలహా

- October 04, 2023 , by Maagulf
బ్యాంకాక్‌లో కాల్పుల ఘటన.. పౌరులకు యూఏఈ సలహా

యూఏఈ: థాయ్‌లాండ్ రాజధాని నగరాన్ని కుదిపేసిన మాల్‌లో కాల్పుల ఘటనతో బ్యాంకాక్‌లోని యూఏఈ ఎంబసీ మంగళవారం ఒక సలహా జారీ చేసింది. ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఎమిరాటీలందరూ సురక్షితంగా ఉన్నారని చెప్పింది. ఈ ఘటనలో కనీసం ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. సాయంత్రం 4.30 గంటలకు (0930 GMT) కాల్పుల ఘటన చోటుచేసుకున్నది. దీంతో వందలాది మంది ప్రజలు బ్యాంకాక్ నడిబొడ్డున ఉన్న సియామ్ పారాగాన్ మాల్ నుండి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి 14 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు థాయ్ పోలీసులు తెలిపారు.  ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు జారీ చేసిన అన్ని భద్రతా సూచనలను పాటించాలని యూఏఈ ఎంబసీ నగరంలోని పౌరులకు పిలుపునిచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే హాట్‌లైన్ 0097180024ను సంప్రదించాలని ఎమిరాటీస్‌ను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com