బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు..నలుగురు మృతి
- October 05, 2023
తమిళనాడు: తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో బాణాసంచా తయారీలో పేలుడు సంభవించడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దీపావళికి నెల రోజులు మాత్రమే ఉండడంతో ఆ ప్రాంతానికి చెందిన కార్మికులు పటాకుల తయారీలో నిమగ్నమయ్యారు. ఉత్పత్తి సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో, తయారు చేస్తున్న పేలుడు పదార్థాలు పెద్ద శబ్దంతో పేలి నలుగురు కార్మికులు మరణించారు. సుమారు 100 మీటర్ల మేర మృతదేహాల భాగాలు చెల్లాచెదురుగా పడి ఉండడంతో పోలీసులు గుర్తించలేకపోయారు. "ఘటన సమయంలో ఫ్యాక్టరీలో ఎనిమిది మంది ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం నాగపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని ఎస్పీ హరీష్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
తాజా వార్తలు
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు







