బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు..నలుగురు మృతి
- October 05, 2023
తమిళనాడు: తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో బాణాసంచా తయారీలో పేలుడు సంభవించడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దీపావళికి నెల రోజులు మాత్రమే ఉండడంతో ఆ ప్రాంతానికి చెందిన కార్మికులు పటాకుల తయారీలో నిమగ్నమయ్యారు. ఉత్పత్తి సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో, తయారు చేస్తున్న పేలుడు పదార్థాలు పెద్ద శబ్దంతో పేలి నలుగురు కార్మికులు మరణించారు. సుమారు 100 మీటర్ల మేర మృతదేహాల భాగాలు చెల్లాచెదురుగా పడి ఉండడంతో పోలీసులు గుర్తించలేకపోయారు. "ఘటన సమయంలో ఫ్యాక్టరీలో ఎనిమిది మంది ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం నాగపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని ఎస్పీ హరీష్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది..WHO ప్రశంసలు..!!
- వేపింగ్ వల్ల ప్రాణాలకు ముప్పు.. టీనేజర్లకు డాక్టర్ల వార్న్..!!
- ఒమన్లో తీవ్రమైన వడగాలులు.. 49°C దాటిన ఉష్ణోగ్రతలు..!!
- పీక్ అవర్స్ లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి: కువైట్
- బహ్రెయిన్ లో హీట్ వేవ్స్.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక..!!
- అల్ ఖోర్ ఫ్యామిలీ పార్క్ లో ఫ్రీ ఫ్లైట్ పారట్ షో..!!
- సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా బాధ్యతలు చేపట్టిన తేళ్ల కస్తూరి
- 5 రోజుల్లోనే జపాన్ ఈ-వీసా..
- ఫ్యాక్టరీలో విషవాయువు లీక్..ముగ్గురు కార్మికులు మృతి!
- కీసర పోలీస్ స్టేషన్ను సందర్శించిన మల్కాజ్గిరి సీపీ సుమతి









