ఫిలిప్పీన్స్ ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపులు.. దుబాయ్-మనీలా సర్వీసులపై ప్రభావం?
- October 07, 2023
యూఏఈ: బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఫిలిప్పీన్స్లోని అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాలలో హై అలర్ట్ ప్రకటించారు.అయితే, దుబాయ్-మనీలా మధ్య విమానాలు యథాతధంగా నడిచాయని ఫిలిప్పీన్స్ ఎయిర్లైన్స్ రీజినల్ హెడ్-EMEA జోష్ వాస్క్వెజ్ తెలిపారు. దుబాయ్ నుండి మనీలా ఫ్లైట్తో సహా తమ విమాన షెడ్యూల్లలో ఎటువంటి ప్రభావం పడలేదని పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్ ఫ్లాగ్ క్యారియర్లు దుబాయ్-మనీలా మధ్య రోజువారీ విమానాలను నడుపుతున్నాయి.
సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్ (CAAP)కి వాణిజ్య విమానాలలో బాంబు ఉన్నట్లు బెదిరింపు రావడంతో వివిధ ఫిలిప్పీన్స్ విమానాశ్రయాల్లో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. స్నిఫర్ డాగ్లను మోహరించారు. ఏవియేషన్ రెగ్యులేటర్ 42 వాణిజ్య విమానాశ్రయాలను హై అలెర్ట్ లో పెట్టాయి. విదేశీ పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన సెబు, బికోల్, దావో మరియు పలావాన్లకు వెళ్లే విమానాల్లో తక్షణ భద్రతా చర్యలను అమలు చేసినట్టు CAAP ప్రతినిధి ఎరిక్ అపోలోనియో వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







