ఫిలిప్పీన్స్ ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపులు.. దుబాయ్-మనీలా సర్వీసులపై ప్రభావం?
- October 07, 2023
యూఏఈ: బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఫిలిప్పీన్స్లోని అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాలలో హై అలర్ట్ ప్రకటించారు.అయితే, దుబాయ్-మనీలా మధ్య విమానాలు యథాతధంగా నడిచాయని ఫిలిప్పీన్స్ ఎయిర్లైన్స్ రీజినల్ హెడ్-EMEA జోష్ వాస్క్వెజ్ తెలిపారు. దుబాయ్ నుండి మనీలా ఫ్లైట్తో సహా తమ విమాన షెడ్యూల్లలో ఎటువంటి ప్రభావం పడలేదని పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్ ఫ్లాగ్ క్యారియర్లు దుబాయ్-మనీలా మధ్య రోజువారీ విమానాలను నడుపుతున్నాయి.
సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్ (CAAP)కి వాణిజ్య విమానాలలో బాంబు ఉన్నట్లు బెదిరింపు రావడంతో వివిధ ఫిలిప్పీన్స్ విమానాశ్రయాల్లో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. స్నిఫర్ డాగ్లను మోహరించారు. ఏవియేషన్ రెగ్యులేటర్ 42 వాణిజ్య విమానాశ్రయాలను హై అలెర్ట్ లో పెట్టాయి. విదేశీ పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన సెబు, బికోల్, దావో మరియు పలావాన్లకు వెళ్లే విమానాల్లో తక్షణ భద్రతా చర్యలను అమలు చేసినట్టు CAAP ప్రతినిధి ఎరిక్ అపోలోనియో వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది..WHO ప్రశంసలు..!!
- వేపింగ్ వల్ల ప్రాణాలకు ముప్పు.. టీనేజర్లకు డాక్టర్ల వార్న్..!!
- ఒమన్లో తీవ్రమైన వడగాలులు.. 49°C దాటిన ఉష్ణోగ్రతలు..!!
- పీక్ అవర్స్ లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి: కువైట్
- బహ్రెయిన్ లో హీట్ వేవ్స్.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక..!!
- అల్ ఖోర్ ఫ్యామిలీ పార్క్ లో ఫ్రీ ఫ్లైట్ పారట్ షో..!!
- సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా బాధ్యతలు చేపట్టిన తేళ్ల కస్తూరి
- 5 రోజుల్లోనే జపాన్ ఈ-వీసా..
- ఫ్యాక్టరీలో విషవాయువు లీక్..ముగ్గురు కార్మికులు మృతి!
- కీసర పోలీస్ స్టేషన్ను సందర్శించిన మల్కాజ్గిరి సీపీ సుమతి









