ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి ముగింపు పలకాలని యూఏఈ పిలుపు
- October 08, 2023
యూఏఈ: ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య పెరుగుతున్న హింసకు ముగింపు పలకాలని యూఏఈ పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ ఘటనలో సంభవించిన మరణాలపై తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ప్రమాదకరమైన పరిణామాలను నివారించడానికి సంయమనం పాటించాలని, తక్షణ కాల్పుల విరమణను పాటించాలని దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది. మరోవైపు ఇజ్రాయెల్, పాలస్తీనా రెండింటిలోనూ హింస పెరగడంతో 200 మందికి పైగా మరణించినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు. గాజా స్ట్రిప్లోని పాలస్తీనా మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్లోకి చొరబాటును చేపట్టారు. సరిహద్దుల గుండా ప్రవేశించారు. పాలక హమాస్ మిలిటెంట్ గ్రూప్ కొత్త ఆపరేషన్ ప్రారంభించి ఇజ్రాయెల్ లోకి వేలాది రాకెట్లను ప్రయోగించింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ స్పందించింది. వైమానిక దాడులతో రెచ్చిపోయింది. యూఏఈ –యూఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యుడిగా - అరబ్-ఇజ్రాయెల్ శాంతి మార్గాన్ని పునరుద్ధరించడానికి అంతర్జాతీయ క్వార్టెట్ను వెంటనే తిరిగి యాక్టివేట్ చేయాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త..
- కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలను నోటి పై చేసిన ప్రభుత్వం
- అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ ఆవిర్భావం: గవర్నర్ శుక్లా
- అమరవీరులకు సీఎం రేవంత్ నివాళి
- యూఏఈ లో 'గుడ్బై ఆల్ ఇన్సెక్ట్స్' ఉత్పత్తుల రీకాల్..!!
- రోడ్డు ప్రమాదం.. సాయానికి ఆపిన వ్యక్తి వాహనం చోరీ..!!
- కువైట్ విమానాశ్రయం T1 ప్రారంభం.. ఒక్కో విమానయాన సంస్థకు రోజుకు ఒక సర్వీసు..!!
- అవినీతి ఆరోపణలపై 160 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్:నజాహా
- ఖతార్లో ఆరోగ్య నిబంధనల ఉల్లంఘన..ప్రముఖ ఫుడ్ కోర్టులు సీజ్..!!
- బలమైన ఆర్థిక సంబంధాలపై బహ్రెయిన్, ఫ్రాన్స్ చర్చలు..!!









