ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి ముగింపు పలకాలని యూఏఈ పిలుపు
- October 08, 2023
యూఏఈ: ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య పెరుగుతున్న హింసకు ముగింపు పలకాలని యూఏఈ పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ ఘటనలో సంభవించిన మరణాలపై తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ప్రమాదకరమైన పరిణామాలను నివారించడానికి సంయమనం పాటించాలని, తక్షణ కాల్పుల విరమణను పాటించాలని దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది. మరోవైపు ఇజ్రాయెల్, పాలస్తీనా రెండింటిలోనూ హింస పెరగడంతో 200 మందికి పైగా మరణించినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు. గాజా స్ట్రిప్లోని పాలస్తీనా మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్లోకి చొరబాటును చేపట్టారు. సరిహద్దుల గుండా ప్రవేశించారు. పాలక హమాస్ మిలిటెంట్ గ్రూప్ కొత్త ఆపరేషన్ ప్రారంభించి ఇజ్రాయెల్ లోకి వేలాది రాకెట్లను ప్రయోగించింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ స్పందించింది. వైమానిక దాడులతో రెచ్చిపోయింది. యూఏఈ –యూఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యుడిగా - అరబ్-ఇజ్రాయెల్ శాంతి మార్గాన్ని పునరుద్ధరించడానికి అంతర్జాతీయ క్వార్టెట్ను వెంటనే తిరిగి యాక్టివేట్ చేయాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ









