ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి ముగింపు పలకాలని యూఏఈ పిలుపు
- October 08, 2023
యూఏఈ: ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య పెరుగుతున్న హింసకు ముగింపు పలకాలని యూఏఈ పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ ఘటనలో సంభవించిన మరణాలపై తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ప్రమాదకరమైన పరిణామాలను నివారించడానికి సంయమనం పాటించాలని, తక్షణ కాల్పుల విరమణను పాటించాలని దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది. మరోవైపు ఇజ్రాయెల్, పాలస్తీనా రెండింటిలోనూ హింస పెరగడంతో 200 మందికి పైగా మరణించినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు. గాజా స్ట్రిప్లోని పాలస్తీనా మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్లోకి చొరబాటును చేపట్టారు. సరిహద్దుల గుండా ప్రవేశించారు. పాలక హమాస్ మిలిటెంట్ గ్రూప్ కొత్త ఆపరేషన్ ప్రారంభించి ఇజ్రాయెల్ లోకి వేలాది రాకెట్లను ప్రయోగించింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ స్పందించింది. వైమానిక దాడులతో రెచ్చిపోయింది. యూఏఈ –యూఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యుడిగా - అరబ్-ఇజ్రాయెల్ శాంతి మార్గాన్ని పునరుద్ధరించడానికి అంతర్జాతీయ క్వార్టెట్ను వెంటనే తిరిగి యాక్టివేట్ చేయాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







