విమానం హైజాక్ చేస్తామంటూ శంషాబాద్ ఎయిర్పోర్టు బెదిరింపు మెయిల్..
- October 09, 2023
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టు కు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. విమానం హైజాక్ చేస్తామని బెదిరిస్తూ శంషాబాద్ ఎయిర్పోర్టుకు మెయిల్ రావడంతో అధికారాలు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో దుబాయ్ వెళ్లే ఓ విమానాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆ విమాన సర్వీసును రద్దు చేసి ప్రయాణికులను హోటల్కు తరలించారు. మరోవైపు, ఈ బెదిరింపు మెయిల్ ఎవరు పంపించారనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి, వినోద్, రాకేష్ లను అదుపులోకి తీసుకొని ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. దుబాయ్ మీదుగా ఇరాక్ కు వెళ్తున్న ఈ ముగ్గురితో పాటు తిరుపతిని సెండ్ హాఫ్ ఇవ్వడానికి వచ్చిన మహిళను సైతం అదుపులోకి తీసుకున్నారు.
ఇరాక్ లోని అమెరికాకు సోల్జర్స్ కు చెందిన బేస్ క్యాంపులో పని చేస్తున్నాడు తిరుపతి. తిరుపతికి ఐసీస్ తో లింకులు ఉన్నాయంటూ మెయిల్ లో పేర్కొన్నారు గుర్తు తెలియని వ్యక్తులు. తిరుపతిని పట్టుకోకపోతే దేశానికి మరో బిగ్ డే అవుతుందంటూ మెయిల్ చేశారు గుర్తు తెలియని వక్తులు. ఈ తరుణంలోనే.. తిరుపతిని సెండ్ హాఫ్ ఇవ్వడానికి వచ్చిన మహిళను సైతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







