పౌరులకు రక్షణ కల్పించాలి, హింసను తక్షణమే ముగించాలి:యూఏఈ అప్పీల్
- October 09, 2023
యూఏఈ: పౌరులకు రక్షణ కల్పించాలని, తక్షణమే హింసను ముగించాలని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. గాజా స్ట్రిప్ సమీపంలోని ఇజ్రాయెల్ పట్టణాలు, గ్రామాలపై హమాస్ దాడులు, జనాభా కేంద్రాలపై వేల రాకెట్లను ప్రయోగించడం తీవ్రమైన చర్యలని, ఇజ్రాయెల్ పౌరులను వారి ఇళ్ల నుండి బందీలుగా అపహరించినట్లు వచ్చిన నివేదికలతో మంత్రిత్వ శాఖ విస్మయం చెందిందని తెలిపారు. రెండు వైపులా పౌరులు ఎల్లప్పుడూ అంతర్జాతీయ మానవతా చట్టం కింద పూర్తి రక్షణ కలిగి ఉండాలని సూచించింది. బాధిత కుటుంబాలకు యూఏఈ తన సంతాపాన్ని తెలియజేసింది. ప్రాంతీయ ఘర్షణను నివారించడానికి అన్ని దౌత్య ప్రయత్నాల కోసం అప్పీల్ చేసింది.
తాజా వార్తలు
- మహిళ వద్ద రూ. 25 కోట్ల విలువైన 15.6 కిలోల గోల్డ్ సీజ్!
- విశాఖలో ఏఐజీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన
- అల్ మెన్హాద్ ఎయిర్బేస్పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!







