కైలాస శిఖరాన్ని దర్శించుకున్న ప్రధాని మోదీ
- October 12, 2023
ఉత్తరాఖండ్: ప్రధాని నరేంద్ర మోదీ దేవభూమి ఉత్తరాఖండ్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం (అక్టోబర్12,2023) ప్రధాని పిథోరాఘడ్ జిల్లాలోని ఆది కైలాస శిఖరాన్ని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తులతో తలపాగా ధరించిన ప్రధాని మోదీ పార్వతి కుండ్లో శివుడికి హారతిని ఇచ్చి.. ప్రత్యేకమైన పూజలు చేశారు.
ఈ పర్యటనలో భాగంగా మోదీ తనదైన శైలిలో స్థానికులను కలిశారు. జగేశ్వర్ ధామ్, సరిహద్దు గ్రామమైన గుంజిని సందర్శించారు. స్థానికులతో ముచ్చటించారు. మహిళలతో ఆప్యాయంగా మాట్లాడారు. వారు నమస్కారం చేస్తుంటే మోదీ కూడా నవ్వుతు వారి చేతులు పట్టుకుని మాట్లాడారు. శిరస్సు వంచి నమస్కరించారు మోదీ. ఓ మహిళ మోదీ తలను ఆప్యాయంగా నిమిరారు. అక్కడే ఓ చిన్నారి మోదీ వద్దకు రాగా బాలుడికి మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. బాబు బుగ్గలు నిమిరి వాత్సల్యాన్ని చూపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!