మరిన్ని దేశాలకు విస్తరిస్తున్న యుద్ధం..
- October 12, 2023
ఇజ్రాయెల్-గాజా యుద్ధం మరిన్ని దేశాలకు విస్తరిస్తోంది. సిరియాలోని రెండు విమానాశ్రయాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. సిరియా రాజధాని డమాస్కస్పై ఇజ్రాయెల్ దాడులు చేసిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. హమాస్ కు మద్దతు ఇస్తున్నందుకు సిరియాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది.
డమాస్కస్, అలెప్పో విమానాశ్రయాలపై దాడులు జరిగాయి. దీంతో ఆ విమానాశ్రయాలను అధికారులు మూసేశారు. ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో డమాస్కస్, అలెప్పోలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ దాడుల వల్ల ప్రాణనష్టం జరిగిందా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఆ రెండు విమానాశ్రయాలపై వ్యూహాత్మకంగా ఒకే సమయంలో ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడింది.
ఇజ్రాయెల్ సైన్యం-హమాస్ మధ్య ఆరో రోజు యుద్ధం కొనసాగుతోన్న వేళ సిరియాపై దాడులు జరిగాయి. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇవాళ ఇజ్రాయెల్ లో పర్యటించారు. తమ దేశం ఇజ్రాయెల్ కు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తూ వస్తోందని, అయితే, ప్రజలను కాపాడుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు