విజయవంతంగా కువైట్ మహానాడు

- May 22, 2016 , by Maagulf

కువైట్ లో ప్రవాసాంధ్ర తెలుగుదేశం ఆద్వర్యంలో శుక్రవారం రాత్రి ఘనంగా ‘మహానాడు’ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి తానా కార్యనిర్వాహక అధ్యక్షుడు వేమన సతీష్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు ముఖ్య అతిదులుగా హాజరయ్యారు. కువైట్ తో పాటు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రవాసంద్రులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలకు హాజరయ్యారు. ప్రవాసాంద్ర తెలుగుదేశం నాయకులు పేరం రమణ, కోడూరి వెంకట్, మలేపాటి సురేష్, ఉదయ్ ప్రకాశ్, ఎస్.కే.ప్రసాద్, గల్ఫ్ నందమూరి ఫ్యాన్స్ సంఘం నాయకులు శాంతారాం నాయుడు, ఓలేటి దివాకర్ నాయుడు, వేగి వెంకటేష్, మాలేపాటి బాబు, మేడమాలి శ్రీను, పోలార్పు బాబు నాయుడు, పాలేటి ప్రసాద్, పట్టాభిరాం తదితరుల ఆద్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

ఎం. వాసు దేవరావు 
(మాగల్ఫ్ ప్రతినిధి),
బహరేన్.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com