ఇకపై బ్యాంకు సేవలు పోస్టాఫీసుల్లో
- May 22, 2016
వచ్చే ఏడాది మార్చి నుంచి పోస్టాఫీసుల్లో పోస్టల్ పేమెంట్ బ్యాంకులను ప్రారంభించనున్నట్లు కేంద్ర, ఐటీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. దేశంలో 25,939 పోస్టాపీసులున్నాయన్న ఆయన ...దేశ ఆర్థిక అభివృద్ధిలో వీటిని వినియోగించుకుంటున్నామన్నారు. ఇప్పటికే 50 స్వదేశీ సంస్థలు పోస్టుల్ పేమెంట్ బ్యాంకులతో కలిసి పనిచేసేందుకు ముందుకువచ్చాయన్నారు. ఇందులో ప్రపంచ బ్యాంకుతో పాటు జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంకు, యూకేకు చెందిన బాక్లేస్, అమెరికాకు చెందిన సిటీ బ్యాంకులు ఉన్నాయన్నారు. ఇవాళ కేంద్రమంత్రి హైదరాబాద్లోని ఓ హోటల్లో దేశంలోని ఆయా పోస్టల్ సర్కిల్ అధికారులతో సమావేశమయ్యారు.
పోస్టల్ రంగంలో డిజిటల్ విధానాలు, సాంకేతిక వినియోగం, మానవ వనరుల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ కామర్స్లోనూ పోస్టల్ డిపార్ట్మెంట్ 81 శాతం వ్యాపారం చేసిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐటీ ఉత్పత్తుల్లోనూ మన దేశం 8లక్షల కోట్ల ఆదాయం సాధించిందన్నారు. ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో లక్షా 21వేల కోట్ల పెట్టుబడులు గత రెండేళ్లలో వచ్చాయని వివరించారు. మన దేశంలోనే 11 కోట్ల మొబైల్ ఫోన్లు గతేడాది తయారయ్యాయన్నారు. జనవరి 2017 నాటికి అన్ని ఫోన్లలో పానిక్ బటన్ ఏర్పాటు చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







