ఇజ్రాయెల్ నుంచి 235 మంది భారతీయులతో ఢిల్లీ వచ్చిన రెండో విమానం
- October 14, 2023
న్యూ ఢిల్లీ: ఆపరేషన్ అజయ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో శనివారం తెల్లవారుజామున యుద్ధంలో దెబ్బతిన్న ఇజ్రాయెల్ దేశం నుంచి రెండవ బ్యాచ్ భారతీయ పౌరులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. ఇద్దరు శిశువులతో సహా 235 మంది భారతీయ పౌరులతో విమానం శనివారం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది.
అక్టోబర్ 7వతేదీన గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పట్టణాలపై దాడుల నేపథ్యంలో స్వదేశానికి తిరిగి రావాలనుకునే వారిని సులభతరం చేయడానికి భారతదేశం గురువారం ఆపరేషన్ అజయ్ ప్రారంభించింది. ఇజ్రాయెల్ నుండి 212 మంది భారతీయ పౌరులతో ఆపరేషన్ అజయ్ కింద మొదటి చార్టర్ ఫ్లైట్ శుక్రవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది.
భారతీయులందరూ మిషన్ యొక్క డేటాబేస్లో పేర్ల నమోదు చేసుకోవడానికి భారత రాయబార కార్యాలయం ప్రారంభించిన డ్రైవ్ తర్వాత ప్రయాణీకులను ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఆధారంగా ఎంపిక చేశారు. వారి విమాన చార్జీలను ప్రభుత్వమే భరిస్తోంది. హమాస్ దాడిలో ఇజ్రాయెల్లో 1,300 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్ ఎదురు వైమానిక దాడుల్లో గాజాలో 1,900 మందికి పైగా మరణించారు.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







