యూరోప్లోని ఐదు నగరాలకు వెళ్లే వారికి ఎయిరిండియా బంపరాఫర్..
- October 14, 2023
న్యూ ఢిల్లీ: ఎయిరిండియా యూరోప్లోని ఐదు నగరాలకు వెళ్లే ప్రయాణీకులకు ఎయిరిండియా తాజాగా బంపరాఫర్ ప్రకటించింది. ఆ ఐదు యూరోపియన్ నగరాలకు భారీ తగ్గింపు ధరలతో విమాన సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించింది. ఇక ఎయిర్ ఇండియా చాలా చౌకగా విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించిన ఆ ఐదు నగరాల జాబితాలో లండన్, కోపెన్హాగన్, మిలన్, పారిస్, వియన్నా ఉన్నాయి. కాగా, ఈ విమాన సర్వీసులలో ప్రారంభ ధరలు వచ్చేసి వన్-వేకి రూ.25వేలు, రౌండ్ ట్రిప్కు రూ.40వేలుగా ఉంటాయని ఎయిరిండియా యాజమాన్యం తెలిపింది. అయితే, ఈ తగ్గింపు ధరలతో విక్రయించే టికెట్లు ఒక పరిమిత కాలానికి మాత్రమే. కనుక మీకు ఆ ఐదు యూరోపియన్ నగరాలను చుట్టేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే విమాన టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ఇకపోతే ఈ ఐదు నగరాలకు వెళ్లే విమాన సర్వీసులు కేవలం ఎకానమీ క్లాస్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. మీరు 'వన్-వే' లేదా 'రౌండ్ ట్రిప్' కోసం టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఢిల్లీ, ముంబై నుంచి ఈ ఐదు నగరాలకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు నడపనుంది. ప్రతివారం 48 నాన్స్టాప్ విమాన సర్వీసులు ఉంటాయి. కాగా, ఈ 'లిమిటెడ్-టైమ్ సేల్' కింద అందించే విమాన టికెట్ల ధరలు మీరు బయలుదేరే నగరం, వర్తించే మారకపు రేట్లు, పన్నుల ఆధారంగా కొద్దిగా మారవచ్చు. ఈ ప్రత్యేక సేల్ కోసం బుకింగ్లు ఈ నెల 14వ తేదీ వరకు ఓపెన్ అయి ఉంటాయి. అలాగే ఈ సేల్ కింద అందించే ప్రత్యేక డిస్కౌంట్ టికెట్లతో ఈ ఏడాది డిసెంబర్ 15 వరకు ప్రయాణాలు చేయవచ్చు. ఎయిర్ ఇండియా అధికారిక వెబ్సైట్ http://www.airindia.com లేదా మొబైల్ యాప్లు లేదా అధీకృత ట్రావెల్ ఏజెంట్ల ద్వారా విమాన టిక్కెట్స్ బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!









