పాస్పోర్ట్ స్కామ్..24 మందిపై సీబీఐ కేసు..50 ప్రాంతాల్లో దాడులు
- October 14, 2023
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, గ్యాంగ్టక్లో ఉన్న సుమారు 50 ప్రదేశాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పాస్పోర్టు సులో ఆ తనిఖీలు జరుగుతున్నాయి. నకిలీ పత్రాలు చూపించి పాస్పోర్టులు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మొత్తం 24 మందిపై కేసు బుక్ చేశారు. గ్యాంగ్టక్లో ఉన్న ఓ అధికారితో పాటు మరో మధ్యవర్తిని అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్లో మాత్రం 24 మంది పేర్లను చేర్చారు. ఈ జాబితాలో 16 మంది అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. లంచాలు తీసుకుని అనర్హులకు పాస్పోర్టులు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కోల్కతా, సిలిగురి, గ్యాంగ్టక్తో పాటు మరికొన్ని నగరాల్లో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









