ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో నలుగురు విదేశీయులతో సహా 9 మంది బందీలు మృతి
- October 15, 2023
యూఏఈ: గత 24 గంటల్లో గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా నలుగురు విదేశీయులతో సహా తొమ్మిది మంది బందీలు మరణించారని హమాస్ సాయుధ విభాగం శనివారం తెలిపింది. అల్ కస్సామ్ బ్రిగేడ్స్ తన టెలిగ్రామ్ ఛానెల్లో ఈ మేరకు ప్రకటించింది. బందీల మరణాలను హమాస్ ప్రకటించడం ఇది రెండోసారి. విదేశీయులతో సహా 13 మంది బందీలు కూడా దాడుల్లో మరణించారని శుక్రవారం తెలిపింది. 120 మందికి పైగా పౌరులు బందీలుగా ఉన్నారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) గతంలో వెల్లడించింది. ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో శనివారం నాటికి 3,500 పైగా మరణాలు చోటుచేసుకున్నాయి.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









