ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో నలుగురు విదేశీయులతో సహా 9 మంది బందీలు మృతి

- October 15, 2023 , by Maagulf
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో నలుగురు విదేశీయులతో సహా 9 మంది బందీలు మృతి

యూఏఈ: గత 24 గంటల్లో గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా నలుగురు విదేశీయులతో సహా తొమ్మిది మంది బందీలు మరణించారని హమాస్ సాయుధ విభాగం శనివారం తెలిపింది. అల్ కస్సామ్ బ్రిగేడ్స్ తన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఈ మేరకు ప్రకటించింది. బందీల మరణాలను హమాస్ ప్రకటించడం ఇది రెండోసారి. విదేశీయులతో సహా 13 మంది బందీలు కూడా దాడుల్లో మరణించారని శుక్రవారం తెలిపింది. 120 మందికి పైగా పౌరులు బందీలుగా ఉన్నారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) గతంలో వెల్లడించింది. ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో శనివారం నాటికి 3,500 పైగా మరణాలు చోటుచేసుకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com