Dh60,000 నగదు లేదా విలువైన వస్తువులను తీసుకువెళుతున్నారా? ఇప్పుడు యాప్ ద్వారా ప్రకటించవచ్చు
- October 17, 2023
యూఏఈ: యూఏఈ నివాసితులు, సందర్శకులు ప్రయాణించేటప్పుడు Dh60,000 కంటే ఎక్కువ విలువైన నగదు, బంగారం, ఆభరణాలు, వజ్రాలు, ఇతర విలువైన వస్తువులను తీసుకువెళుతున్నప్పుడు దానిని అఫ్సే (Afseh) అనే యాప్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవచ్చు. Dh60,000 కంటే ఎక్కువ లేదా ఇతర కరెన్సీ, ఆర్థిక ఆస్తులు, విలువైన మెటల్ లేదా రాళ్లతో సమానమైన మొత్తంతో యూఏఈలోకి లేదా వెలుపల ప్రయాణించే ప్రయాణీకులందరూ కస్టమ్స్ అధికారులకు ప్రకటించడం తప్పనిసరి. విమానాశ్రయాలు, ఓడరేవులు మరియు భూ సరిహద్దుల ద్వారా దేశంలోకి ప్రవేశించే మరియు నిష్క్రమించే నివాసితులు, సందర్శకులందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది.
60,000 దిర్హామ్లకు పైగా నిధులు మరియు విలువైన వస్తువులను ప్రకటించాలని యూఏఈ తీసుకున్న నిర్ణయం మనీలాండరింగ్ను నిరోధించే ప్రయత్నంలో భాగం. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు కస్టమ్స్ అధికారులకు వెల్లడించకుండా Dh60,000 లేదా దానికి సమానమైన విదేశీ కరెన్సీని తీసుకువెళ్లవచ్చు. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) ద్వారా అఫ్సే అనే యాప్ను రూపొందించారు. నివాసితులు, జాతీయులు ఆరు దశల ద్వారా వివరాలను సమర్పించాలి. నగదు మరియు విలువైన వస్తువుల మొత్తం లేదా విలువను కూడా ప్రకటించాలి. ఈ సమాచారాన్ని సవరించవచ్చు కాబట్టి, దేశంలోకి లేదా వెలుపలికి వస్తున్నప్పుడు విలువ పెరిగినా లేదా తగ్గిన పక్షంలో వ్యక్తులు తర్వాత దాన్ని అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది. అన్ని వివరాలను సమర్పించిన తర్వాత, నివాసితులు SMS, ఇమెయిల్ ద్వారా QR కోడ్ని అందుకుంటారు. విమానాశ్రయం లేదా సరిహద్దు వద్దకు వచ్చిన తర్వాత, వారు కేవలం కస్టమ్స్ అధికారులకు ఇమెయిల్ను చూపాల్సి ఉంటుంది. అలాగే, సందర్శకులు మరియు నివాసితులు ICP నుండి స్వీకరించిన డిక్లరేషన్ ఫారమ్ ఆమోదాన్ని చూపవలసి ఉంటుంది. కాబట్టి ఎటువంటి సమస్య లేకుండా డబ్బు మార్పిడి చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. ప్రజలు యూఏఈ పాస్ ద్వారా కూడా అఫ్సేలో నమోదు చేసుకోవచ్చు. యాప్ Android మరియు Apple ప్లాట్ఫారమ్లలో అందుబాటులో ఉంది. సేవలు ఉచితం. దీంతోపాటు నివాసితులు, సందర్శకులు ICP వెబ్సైట్ ద్వారా కూడా ప్రకటించవచ్చు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









