ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కొత్త లుక్ ఆవిష్కరణ
- October 19, 2023
న్యూఢిల్లీ: రీబ్రాండింగ్లో భాగంగా ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బుధవారం తన కొత్త లుక్ను ప్రజల ముందుంచింది. మునుపటి డిజైన్కు భిన్నంగా కొత్త చిహ్నాలతో (లివరీ) మెరిసిపోతున్న బోయింగ్-737 విమానం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సీఈఓ అలోక్ సింగ్ ఆవిష్కరించారు. ఇది కేవలం కొత్త బ్రాండ్ డిజైన్ కాదని, తాము ఎవరో, తమ విజన్ ఏంటో ఈ మార్పులతో చెప్పదలుచుకున్నామని సంస్థ సీఈఓ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా సీఈఓ కాంప్బెల్ విల్సన్ మాట్లాడుతూ ఇకపై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కొత్త తరానికి చెందిన ఎయిర్లైన్స్గా నిలుస్తుందన్నారు.
రాబోయే 15 నెలల్లో కొత్త డిజైన్, చిహ్నాలు ఉన్న 50 బోయింగ్ 737 విమానాలను సంస్థ అందుబాటులోకి తేనుంది. వచ్చే ఏడేళ్లల్లో 170 నారో బాడీ విమానాలు కలిగిన సంస్థగా ఎదగాలని ఎయిర్ఇండియా ఎక్స్ప్రెస్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇటీవలే ఎయిర్ ఇండియా కొత్త లోగోను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!









