యూఏఈలో రోడ్డు ప్రమాదం..ఎమిరాటీ మృతి
- October 20, 2023
యూఏఈ: పికప్ ట్రక్ ట్రాఫిక్ స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో ఒక ఎమిరాటి మరణించాడు. ఇందులో మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఎమిరేట్లోని షామల్ ప్రాంతంలోని ఒక కూడలికి సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని ఒక ఉన్నత అధికారి తెలిపారు. రస్ అల్ ఖైమా పోలీస్లోని ట్రాఫిక్, పెట్రోల్ డిపార్ట్మెంట్ యాక్టింగ్ డైరెక్టర్ కల్నల్ డాక్టర్ మహ్మద్ అల్ బహర్ ప్రకారం.. వీరిద్దరి కారు కూడలికి సమీపంలో దూసుకెళ్లి స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాద నివేదిక అందిన వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ను రంగంలోకి దిగింది. డ్రైవర్తో పాటు అతని సహచరుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎమిరాటీ మరణించాడు. డ్రైవర్ గాయపడ్డాడని, అయితే పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









