గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం యూఏఈ పిలుపు
- October 22, 2023
యూఏఈ: కైరో శాంతి సదస్సులో ప్రపంచ నాయకులతో కలిసి గాజా స్ట్రిప్లో యుద్ధాన్ని ముగించాలని దే యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శనివారం పునరుద్ఘాటించారు. ఇజ్రాయెల్ - హమాస్ గ్రూపు మధ్య జరుగుతున్న యుద్ధం గురించి చర్చించడానికి ఈజిప్ట్ అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించింది. "యూఏఈ పౌరుల జీవితాలకు అత్యంత రక్షణ, మానవతా సహాయానికి అడ్డంకులు లేని యాక్సెస్ కల్పించాలి. గాజా స్ట్రిప్లోని శత్రుత్వాలను తక్షణమే ముగించాలి." అని షేక్ మొహమ్మద్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్లో ఒక పోస్ట్లో తెలిపారు. మరింత హింస, విస్తృత అస్థిరతను నివారించడానికి కలిసి పని చేయాలని అధ్యక్షుడు అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఈజిప్టు యొక్క రాఫా క్రాసింగ్ ప్రారంభమైన వెంటనే, మానవతా సహాయ కాన్వాయ్ గాజా స్ట్రిప్కు చేరుకోవడానికి వీలుగా శిఖరాగ్ర సమావేశం జరిగింది. శిఖరాగ్ర సమావేశానికి హాజరైన యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ.. కాల్పుల విరమణ పాటించాలని కోరారు. యుద్ధంలో ఇప్పటికీ వేలాది మంది చనిపోయారని, ఒక మిలియన్ పాలస్తీనియన్లు స్వస్థలాలను విడిచారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







