గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం యూఏఈ పిలుపు
- October 22, 2023
యూఏఈ: కైరో శాంతి సదస్సులో ప్రపంచ నాయకులతో కలిసి గాజా స్ట్రిప్లో యుద్ధాన్ని ముగించాలని దే యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శనివారం పునరుద్ఘాటించారు. ఇజ్రాయెల్ - హమాస్ గ్రూపు మధ్య జరుగుతున్న యుద్ధం గురించి చర్చించడానికి ఈజిప్ట్ అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించింది. "యూఏఈ పౌరుల జీవితాలకు అత్యంత రక్షణ, మానవతా సహాయానికి అడ్డంకులు లేని యాక్సెస్ కల్పించాలి. గాజా స్ట్రిప్లోని శత్రుత్వాలను తక్షణమే ముగించాలి." అని షేక్ మొహమ్మద్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్లో ఒక పోస్ట్లో తెలిపారు. మరింత హింస, విస్తృత అస్థిరతను నివారించడానికి కలిసి పని చేయాలని అధ్యక్షుడు అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఈజిప్టు యొక్క రాఫా క్రాసింగ్ ప్రారంభమైన వెంటనే, మానవతా సహాయ కాన్వాయ్ గాజా స్ట్రిప్కు చేరుకోవడానికి వీలుగా శిఖరాగ్ర సమావేశం జరిగింది. శిఖరాగ్ర సమావేశానికి హాజరైన యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ.. కాల్పుల విరమణ పాటించాలని కోరారు. యుద్ధంలో ఇప్పటికీ వేలాది మంది చనిపోయారని, ఒక మిలియన్ పాలస్తీనియన్లు స్వస్థలాలను విడిచారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







