AMR గ్రూప్ సంస్థలపై ముగిసిన ఐటీ సోదాలు
- October 22, 2023
AMR కన్ స్ట్రక్షన్స్ కంపెనీలపై ఐటీ సోదాలు ముగిశాయి. నాలుగు రోజుల పాటు ఐటీ, ఈసీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సుమారు రూ.15కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించారు. బెంగళూరు కేంద్రంగా వివిధ పార్టీలకు ఏఎంఆర్ కంపెనీ డబ్బులు పంపిస్తున్నట్లు గుర్తించారు.
హైదరాబాద్, బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఏఎంఆర్ కంపెనీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో అటు పోలీసులు ఇటు ఎన్నికల సంఘం అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో దాదాపు రూ.15 కోట్ల నగదు సీజ్ చేశారు. ఈ డబ్బు మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది అనే ఆధారాలు సేకరించారు. ఆ డబ్బు ఏఎంఆర్ కన్ స్ట్రక్షన్స్ కంపెనీ నుంచి బదిలీ అయినట్లుగా పోలీసులు, ఈసీ అధికారులు, ఐటీ అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజుల నుంచి ఏఎంఆర్ కన్ స్ట్రక్షన్స్ కంపెనీలతో పాటు కంపెనీ డైరెక్టర్ల నివాసాల్లో అధికారులు సోదాలు చేశారు.
బెంగళూరు నుంచి తెలంగాణతో పాటు ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాలకు ఈ కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో పార్టీ ఫండ్ ఇవ్వడానికి డబ్బు తరలిస్తున్నట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజుల నుంచి హైదరాబాద్, బెంగళూరుతో పాటు దాదాపు 12 ప్రాంతాల్లో ఈసీ, ఐటీ అధికారులు సోదాలు చేశారు. కీలకమైన పత్రాలతో పాటు నగదు కూడా సీజ్ చేశారు.
బెంగళూరులో ఉన్న కొందరు కాంగ్రెస్ నేతల నుంచి ఈ డబ్బు బదిలీ అయినట్లు తెలుస్తోంది. నిజంగానే వారి ప్రమేయం ఉందా? లేదా? అన్నది తేల్చేందుకు అధికారులు ఆధారాలు గుర్తించే పనిలో ఉన్నారు.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







