ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి ముగింపు పలకాలి: పోప్ ఫ్రాన్సిస్
- October 23, 2023
యూఏఈ: ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి ముగింపు పలకాలి పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం కోరారు. గాజా స్ట్రిప్లోకి మానవీయ సహాయాన్ని అనుమతించాలని పిలుపునిచ్చారు. "యుద్ధం ఎప్పుడూ ఓటమే. ఇది మానవ సౌభ్రాతృత్వ విధ్వంసం. సోదరులారా యుద్ధాన్ని ఆపండి.’’ అని రోమ్లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్లో తన సాంప్రదాయ ఏంజెలస్ ప్రార్థన తర్వాత ఫ్రాన్సిస్ ప్రకటన చేశారు. గాజా ప్రజలకు మానవతా సహాయం అందించడం కొనసాగించాలని, బందీలను విడిపించాలని 86 ఏళ్ల పోప్ పిలుపునిచ్చారు.
హమాస్ మిలిటెంట్లు అక్టోబరు 7న గాజా స్ట్రిప్ నుండి ఇజ్రాయెల్లోకి రాకెట్ దాడులు చేసారు. ఇందులో కనీసం 1,400 మంది చనిపోగా.. పలువురు ఇజ్రాయెల్ వాసులను హమాస్ ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్నారు. అనంతరం ఇజ్రాయెల్ ప్రతీకార బాంబు దాడుల్లో 4,300 మంది వరకు పాలస్తీనియన్లు మరణించారు. ఈ క్రమంలో గాజాకు నీరు, ఆహారం, విద్యుత్ సరఫరాలను ఇజ్రాయెట్ అడ్డుకున్నది. తాజాగా అంతర్జాతీయ సమాజం ఒత్తిడి మేరకు ఇద్దరు అమెరికన్ బందీలను విడుదల చేసింది హమాస్. అలాగే యూఎన్ సహాయక సామగ్రిని గాజాలోకి అనుమతించారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









