తేజ్ తుఫాను..నివాసితులకు అలెర్ట్ జారీ
- October 23, 2023
యూఏఈ: జాతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసినట్లుగా ఆదివారం మధ్యాహ్నం యూఏఈలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో రస్ అల్ ఖైమా, ఫుజైరా ప్రాంతాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్లను అధికారులు జారీ చేశారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాను కేటగిరీ 2 తుఫాను మారిందని, వచ్చే 24 గంటల్లో ఇది కేటగిరీ 3 వన్గా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పర్వత ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షంలో కార్లు నడుపుతున్న వీడియోలను అధికార యంత్రాంగం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వాతావరణ పరిస్థితులలో వాహనదారులు మరింత జాగ్రత్తగా ఉండాలని NCM హెచ్చరిక జారీ చేసింది.
అత్యవసరమైతే తప్ప వాహనాలను బయటకు తీయొద్దని, డ్రైవ్ చేయాల్సి చేస్తే.. రోడ్డుపై ఉన్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. విజిబిలిటీ తగ్గినప్పుడు తక్కువ-బీమ్ లైట్లను ఆన్ చేయాలి. అధికారిక ఛానెల్ల నుండి వచ్చే వాతావరణ సూచనలను అనుసరించాలి. నివాసితులు పుకార్లను వ్యాప్తి చేయకుండా ఉండాలని కోరింది. సోమవారం మధ్యాహ్నం కూడా యూఏఈలో వర్షం కురిసే అవకాశం ఉందని, పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని ఎన్సిఎం తన ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









