యూఏఈలో భవనం పై నుంచి పడి 17 ఏళ్ల యువకుడు మృతి
- October 24, 2023
యూఏఈ: దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన 17 ఏళ్ల బాలుడు అజ్మాన్లో అతను నివసించే భవనంపై నుండి పడి మరణించాడు. సోమవారం తెల్లవారుజామున అతని మృతదేహాన్ని అజ్మాన్ పోలీసులు గుర్తించారు. మృతుడి తల్లిదండ్రులను సమాచారం అందజేసినట్లు పోలీసులు తెలిపారు.మృతుడు గ్లోబల్ ఇండియన్ స్కూల్ అజ్మాన్లో గ్రేడ్ 12 చదువుతున్నట్లు చెప్పారు. బాలుడు తన కుటుంబంతో కలిసి చర్చిలో ముందురోజు సాయంత్రం ఒక కమ్యూనిటీ ఈవెంట్లో పాల్గొన్నాడు. అతను భవనం పై నుంచి ఎలా పడి చనిపోయాడు అనేది స్పష్టంగా తెలియరాలేదు. సామాజిక కార్యకర్తల ప్రకారం.. బాలుడి మృతదేహాన్ని తిరిగి భారతదేశానికి తీసుకెళ్లాలని కుటుంబం భావిస్తోంది. బాలుడికి ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. అతని తండ్రి వ్యాపారవేత్త కాగా.. అతని తల్లి దుబాయ్లో నర్సుగా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







