యూఏఈలో భవనం పై నుంచి పడి 17 ఏళ్ల యువకుడు మృతి

- October 24, 2023 , by Maagulf
యూఏఈలో  భవనం పై నుంచి పడి 17 ఏళ్ల యువకుడు మృతి

యూఏఈ: దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన 17 ఏళ్ల బాలుడు అజ్మాన్‌లో అతను నివసించే భవనంపై నుండి పడి మరణించాడు. సోమవారం తెల్లవారుజామున అతని మృతదేహాన్ని అజ్మాన్ పోలీసులు గుర్తించారు. మృతుడి  తల్లిదండ్రులను సమాచారం అందజేసినట్లు పోలీసులు తెలిపారు.మృతుడు  గ్లోబల్ ఇండియన్ స్కూల్ అజ్మాన్‌లో గ్రేడ్ 12 చదువుతున్నట్లు చెప్పారు.  బాలుడు తన కుటుంబంతో కలిసి చర్చిలో ముందురోజు సాయంత్రం ఒక కమ్యూనిటీ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. అతను భవనం పై నుంచి  ఎలా పడి చనిపోయాడు అనేది స్పష్టంగా తెలియరాలేదు. సామాజిక కార్యకర్తల ప్రకారం.. బాలుడి మృతదేహాన్ని తిరిగి భారతదేశానికి తీసుకెళ్లాలని కుటుంబం భావిస్తోంది. బాలుడికి ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. అతని తండ్రి వ్యాపారవేత్త కాగా..  అతని తల్లి దుబాయ్‌లో నర్సుగా పనిచేస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com