యూఏఈలో సెకండ్ సాలరీ స్కీమ్.. సబ్స్క్రయిబ్ చేసుకున్న వారిలో భారతీయులే టాప్
- October 24, 2023
యూఏఈ: యూఏఈలో సెకండ్ సాలరీ స్కీమ్ సబ్స్క్రయిబ్ చేసుకున్న వారిలో భారతీయులే అధికంగా ఉన్నారు. ప్రత్యేకించి దక్షిణ మరియు ఆగ్నేయాసియా నుండి వచ్చిన ప్రవాసులు తమ ఆదాయ ఆదాయ మార్గాలను పెంచుకోవాలని చూస్తున్నారు.ఇటీవల పొదుపు, పెట్టుబడి జాతీయ బాండ్లు, ఎమిరేట్స్ డ్రా ద్వారా రెండవ జీతం పథకాలు ప్రవేశపెట్టబడ్డాయి. నేషనల్ బాండ్స్ సెకండ్ సాలరీ ప్లాన్ కేవలం నెలకు Dh1,000 లతో ప్రారంభమవుతుంది. సబ్స్క్రైబర్లు 3 నుండి 10 సంవత్సరాల వరకు పదవీకాలాన్ని ఎంచుకోవచ్చు. పొదుపు వ్యవధి ముగిసిన తర్వాత వారు ప్రతి నెలా వారి ఎంపిక వ్యవధికి ప్రధాన మొత్తాన్ని, లాభాన్ని ఆదాయంగా స్వీకరిస్తారు.
అదే సమయంలో ఎమిరేట్స్ డ్రా విజేతకు 25 సంవత్సరాల పాటు నెలకు Dh25,000 బహుమతిని అందజేస్తుంది. ఇప్పటివరకు ఎమిరేట్స్ డ్రా విజేతలలో ఎక్కువ మంది దక్షిణ, ఆగ్నేయాసియా ప్రాంతాల జాతీయులే ఉన్నారు. నేషనల్ బాండ్స్ సేవింగ్స్ ఇండెక్స్ ప్రకారం.. ఈ ప్లాన్ లో నమోదు చేసుకున్న మొదటి ఐదు జాతీయులలో.. భారతీయులు (53 శాతం), యూఏఈ జాతీయులు (13 శాతం), ఫిలిపినోలు (8 శాతం), పాకిస్థానీయులు (5 శాతం), జోర్డానియన్లు (2 శాతం) ఉన్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







