యూఏఈలో సెకండ్ సాలరీ స్కీమ్.. సబ్స్క్రయిబ్ చేసుకున్న వారిలో భారతీయులే టాప్
- October 24, 2023
యూఏఈ: యూఏఈలో సెకండ్ సాలరీ స్కీమ్ సబ్స్క్రయిబ్ చేసుకున్న వారిలో భారతీయులే అధికంగా ఉన్నారు. ప్రత్యేకించి దక్షిణ మరియు ఆగ్నేయాసియా నుండి వచ్చిన ప్రవాసులు తమ ఆదాయ ఆదాయ మార్గాలను పెంచుకోవాలని చూస్తున్నారు.ఇటీవల పొదుపు, పెట్టుబడి జాతీయ బాండ్లు, ఎమిరేట్స్ డ్రా ద్వారా రెండవ జీతం పథకాలు ప్రవేశపెట్టబడ్డాయి. నేషనల్ బాండ్స్ సెకండ్ సాలరీ ప్లాన్ కేవలం నెలకు Dh1,000 లతో ప్రారంభమవుతుంది. సబ్స్క్రైబర్లు 3 నుండి 10 సంవత్సరాల వరకు పదవీకాలాన్ని ఎంచుకోవచ్చు. పొదుపు వ్యవధి ముగిసిన తర్వాత వారు ప్రతి నెలా వారి ఎంపిక వ్యవధికి ప్రధాన మొత్తాన్ని, లాభాన్ని ఆదాయంగా స్వీకరిస్తారు.
అదే సమయంలో ఎమిరేట్స్ డ్రా విజేతకు 25 సంవత్సరాల పాటు నెలకు Dh25,000 బహుమతిని అందజేస్తుంది. ఇప్పటివరకు ఎమిరేట్స్ డ్రా విజేతలలో ఎక్కువ మంది దక్షిణ, ఆగ్నేయాసియా ప్రాంతాల జాతీయులే ఉన్నారు. నేషనల్ బాండ్స్ సేవింగ్స్ ఇండెక్స్ ప్రకారం.. ఈ ప్లాన్ లో నమోదు చేసుకున్న మొదటి ఐదు జాతీయులలో.. భారతీయులు (53 శాతం), యూఏఈ జాతీయులు (13 శాతం), ఫిలిపినోలు (8 శాతం), పాకిస్థానీయులు (5 శాతం), జోర్డానియన్లు (2 శాతం) ఉన్నారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







