తీవ్ర తుఫానుగా మారిన అల్పపీడనం 'హమూన్'..
- October 24, 2023
భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారింది. ఈ తుఫానుకి 'హమూన్'గా పేరు పెట్టినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండి) మంగళవారం ప్రకటించింది. ఒడిసాకు 200 కి.మీ దూరంలో తీరం దాటే అవకాశం ఉన్నందున ఒడిసాపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 21 కి.మీ వేగంతో దూసుకువస్తున్న ఈ తుఫాను మరికొన్ని గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అన్నారు. ఒడిసాలోని పారాదీప్కు 230 కి.మీ, పశ్చిమ బెంగాల్లోని ధిగాకు 240 కి.మీ దూరంలో, బంగ్లాదేశ్లోని చిట్టిగాంగ్కు 410 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని తెలిపారు.
ఈశాన్య దిశగా కదులుతున్న తుఫాను క్రమంగా బలహీనపడి మంగళవారం సాయంత్రానికి తీవ్రంగా మారే అవకాశం ఉందని, గంటకు 65 -75 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని ఐఎండి అంచనా వేసింది. బుధవారం బంగ్లాదేశ్లోని హెపుపరా , చిట్టిగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు ఒడిసాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు.
తాజా వార్తలు
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు







