భారతీయులకు శుభవార్త చెప్పిన శ్రీలంక

- October 25, 2023 , by Maagulf
భారతీయులకు శుభవార్త చెప్పిన శ్రీలంక

కువైట్: పైలట్ ప్రాజెక్ట్ కింద భారతదేశం, చైనా,  రష్యాతో సహా ఏడు దేశాల నుండి వచ్చే సందర్శకులకు శ్రీలంక వీసా రహిత ప్రవేశాన్ని అనుమతిస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి మంగళవారం తెలిపింది. ఈ నిర్ణయాన్ని శ్రీలంక కేబినెట్ ఆమోదించిందని ఆ దేశ మంత్రి అలీ సబ్రీ తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ మార్చి 31, 2024 వరకు కొనసాగుతుందని వెల్లడించారు.  "భారతదేశం, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా & థాయ్‌లాండ్‌లకు ఉచిత వీసాలను మార్చి 31 వరకు పైలట్ ప్రాజెక్ట్‌గా తక్షణమే అమలు చేయడానికి క్యాబినెట్ ఆమోదించింది." అని మంత్రి సాబ్రీ సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్ )లో పేర్కొన్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com