అధిష్ఠానం ఆదేశిస్తే కామారెడ్డిలో పోటీకి సిద్ధమే: పి.సి.సి ప్రెసిడెంట్
- October 26, 2023
హైదరాబాద్: అధిష్ఠానం ఆదేశిస్తే కామారెడ్డిలో పోటీకి సిద్ధమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తానైనా లేదా.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అయినా పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధమని చెప్పారు. సిఎం కెసిఆర్, ఆయన తనయుడు, మంత్రి కెటిఆర్ను చిత్తుగా ఓడించేందుకు రెడీగా ఉన్నామని తెలిపారు. కొడంగల్లో పోటీ చేయాలని కెసిఆర్ను ఆహ్వానించానని.. కానీ.. కొడంగల్లో పోటీకి కెసిఆర్ రాకపోతే కామారెడ్డిలో పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు.
“ఉమ్మడి ఏపీలో ప్రజలు ఎప్పుడూ హంగ్కు అవకాశం ఇవ్వలేదు. తెలంగాణలోనూ హంగ్ ఎప్పుడూ రాలేదు. ఈ ఎన్నికల్లో మూడింట రెండో వంతు మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. రాజగోపాల్రెడ్డి, వివేక్, విశ్వేశ్వర్రెడ్డి, విజయశాంతి, డీకే అరుణ, జితేందర్రెడ్డి బిజెపిలో చేరారు. అయితే బిజెపి, బిఆర్ఎస్ నేతలు దోచుకున్నది పంచుకుంటున్నారని గ్రహించారు. దోపిడీదారులతో ఇమడలేమని.. ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని గుర్తించారు. రాష్ట్రంలో అవినీతిని నిలువరించేందుకు బిజెపిలో చేరామన్నారు. బిజెపి సిద్ధాంతాలను ఆకర్షితులై ఆ పార్టీలో చేరలేదు. బిఆర్ఎస్ అవినీతిలో బిజెపి నేతలు భాగస్వాములని గ్రహించి వెనక్కి వస్తున్నారు. కాంగ్రెస్లో తిరిగి చేరే నేతలను సాదరంగా ఆహ్వానించి తగిన హోదా ఇస్తాం.” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







