పాలస్తీనియన్లకు బహ్రెయిన్ రాజు మద్దతు.. ప్రతినిధుల మండలి ప్రశంసలు
- October 27, 2023
బహ్రెయిన్: పాలస్తీనా ప్రజల చట్టబద్ధమైన హక్కులకు మద్దతుగా హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా చేసిన అద్భుతమైన దౌత్య ప్రయత్నాలకు ప్రతినిధుల మండలి ప్రశంసించింది. కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ బహ్రెయిన్ రాజ్యం చారిత్రక, దృఢమైన వైఖరిని ధృవీకరించిందని తన ప్రకటనలో వెల్లడించింది. న్యాయమైన, శాశ్వతమైన మరియు స్థిరమైన శాంతిని తీసుకురావడానికి HM రాజు అవిశ్రాంత ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొంది. పాలస్తీనా ప్రజలు తమ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకునే హక్కుకు ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలని సూచించింది. కైరో సమ్మిట్ ఫర్ పీస్లో రాజు చేసిన ప్రసంగాన్ని ప్రతినిధుల మండలి ప్రశంసించింది. దీనిలో పాలస్తీనా ప్రజల చట్టబద్ధమైన హక్కులను పొందకుండా మధ్యప్రాచ్యంలో స్థిరత్వం ఉండదని HM చెప్పారు. పరిస్థితిని మరింత దిగజార్చకుండా సైనిక కార్యకలాపాలను ముగించాలని, అమాయక పౌరులకు రక్షణ కల్పించాలని, గాజా స్ట్రిప్లోకి మానవతా సహాయాన్ని అనుమతించాలని, ఖైదీలను విడుదల చేయాలని, అలాగే మానవతా మరియు అంతర్జాతీయ అంశాలకు కట్టుబడి ఉండాలన్న HM కింగ్ హమద్ పిలుపును కౌన్సిల్ ప్రశంసించింది.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







