యూఏఈకి వెళుతున్నారా.. అప్టేడ్ నిషేధిత వస్తువుల జాబితా వెల్లడి
- October 27, 2023
యూఏఈ: ఇండియా-యుఏఈ ఎయిర్ కారిడార్ అత్యంత రద్దీగా ఉండే మార్గాలలో ఒకటి. పెద్ద సంఖ్యలో భారతీయులు వ్యాపారం, పర్యాటకం, ఉపాధి ప్రయోజనాల కోసం గల్ఫ్ దేశానికి వెళతారు. దీపావళి, న్యూ ఇయర్ వేడుకల సమయాల్లో రద్దీ విపరీతంగా పెరుగుతుంది. ముంబై విమానాశ్రయం ప్రకారం.. చెక్-ఇన్ సామానులో తరచుగా కనిపించే కొన్ని నిషేధిత వస్తువులను ప్రకటించారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA) మూడవ త్రైమాసిక ప్రయాణీకుల గణాంకాల ప్రకారం.. దుబాయ్, లండన్, అబుదాబిలు అత్యంత ప్రాధాన్య అంతర్జాతీయ గమ్యస్థానాలుగా ఉన్నాయి. యూఏఈలో 3.5 మిలియన్లకు పైగా ప్రవాస భారతీయులు ఉంటారు. అలాగే పర్యాటకుల సంఖ్యలో భారతీయులు అత్యధికంగా ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాన్ని 6 మిలియన్ల మంది ప్రయాణికులతో 2023 ప్రథమార్థంలో భారతదేశం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అగ్ర గమ్యస్థానంగా నిలిచింది.
నిషేధించబడిన కొన్ని వస్తువుల జాబితా:
ఎండు కొబ్బరి (కొప్రా), బాణసంచా,పార్టీ పాపర్స్, మ్యాచ్ బాక్సులు, పెయింట్ డబ్బాలు, అగ్ని కర్పూరం, నెయ్యి, ఊరగాయలు(చట్నీలు), నూనె సంబంధిత ఆహార పదార్థాలు, ఇ-సిగరెట్లు, లైటర్లు, పవర్ బ్యాంకులు, స్ప్రే సీసాలు, గసగసాలు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









