యూఏఈకి వెళుతున్నారా.. అప్టేడ్ నిషేధిత వస్తువుల జాబితా వెల్లడి
- October 27, 2023
యూఏఈ: ఇండియా-యుఏఈ ఎయిర్ కారిడార్ అత్యంత రద్దీగా ఉండే మార్గాలలో ఒకటి. పెద్ద సంఖ్యలో భారతీయులు వ్యాపారం, పర్యాటకం, ఉపాధి ప్రయోజనాల కోసం గల్ఫ్ దేశానికి వెళతారు. దీపావళి, న్యూ ఇయర్ వేడుకల సమయాల్లో రద్దీ విపరీతంగా పెరుగుతుంది. ముంబై విమానాశ్రయం ప్రకారం.. చెక్-ఇన్ సామానులో తరచుగా కనిపించే కొన్ని నిషేధిత వస్తువులను ప్రకటించారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA) మూడవ త్రైమాసిక ప్రయాణీకుల గణాంకాల ప్రకారం.. దుబాయ్, లండన్, అబుదాబిలు అత్యంత ప్రాధాన్య అంతర్జాతీయ గమ్యస్థానాలుగా ఉన్నాయి. యూఏఈలో 3.5 మిలియన్లకు పైగా ప్రవాస భారతీయులు ఉంటారు. అలాగే పర్యాటకుల సంఖ్యలో భారతీయులు అత్యధికంగా ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాన్ని 6 మిలియన్ల మంది ప్రయాణికులతో 2023 ప్రథమార్థంలో భారతదేశం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అగ్ర గమ్యస్థానంగా నిలిచింది.
నిషేధించబడిన కొన్ని వస్తువుల జాబితా:
ఎండు కొబ్బరి (కొప్రా), బాణసంచా,పార్టీ పాపర్స్, మ్యాచ్ బాక్సులు, పెయింట్ డబ్బాలు, అగ్ని కర్పూరం, నెయ్యి, ఊరగాయలు(చట్నీలు), నూనె సంబంధిత ఆహార పదార్థాలు, ఇ-సిగరెట్లు, లైటర్లు, పవర్ బ్యాంకులు, స్ప్రే సీసాలు, గసగసాలు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







