గాజాలో హింసాకాండ పెరగడంపై ఆందోళన
- October 28, 2023
మస్కట్: గాజాలో హింసాకాండ పెరగడంపై మస్కట్లో జరిగిన ముప్పై నాల్గవ సమావేశం సందర్భంగా అరబ్ మంత్రుల మండలి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. గాజా స్ట్రిప్లోని పాలస్తీనియన్ ప్రజలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ అనాగరిక దురాక్రమణకు పాల్పడుతుందని తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో వేలాది మంది మంది మరణించారని, పదివేల మంది వరకు గాయపడ్డారని పేర్కొంది. అదే సమయంలో వేల మంది ప్రజలు ఆశ్రయం లేకుండా నిరాశ్రయులయ్యారని, ముఖ్యంగా మహిళలు, పిల్లలు మరియు వృద్ధుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. గాజాలో జీవన విధ్వంసానికి ఇజ్రాయెల్ పాల్పడుతుందని, మౌలిక సదుపాయాలు, ఆసుపత్రుల విధ్వంసానికి పాల్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పాలస్తీనియన్ పట్ల తన బాధ్యతలను నిర్వర్తించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







