పాలస్తీనా ప్రజల కోసం ప్రార్థనలు చేసిన కింగ్ సుల్తాన్

- October 30, 2023 , by Maagulf
పాలస్తీనా ప్రజల కోసం ప్రార్థనలు చేసిన కింగ్ సుల్తాన్

బహ్రెయిన్: గాజా పౌరులపై అత్యంత దారుణమైన దురాగతాలను ప్రపంచం ముక్తకంఠంతో ఖండిస్తుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో 3,000 మందికి పైగా పిల్లలు, మహిళలు, వృద్ధులు, యువకులు మరణించగా. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తాగేందుకు మంచినీరు, తినేందుకు ఆహారం లేక అలమటిస్తున్నారు. రోజు బాంబు దాడులు నిత్యకృత్యమయ్యాయి.  పాలస్తీనా ప్రజలకు మద్దతుగా బహ్రెయిన్ ఉంటుందని హెచ్‌ఎం రాజు స్పష్టం చేశారు. పాలస్తీనా ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు.  గాజాలో శాంతిని పెంపొందించడానికి అవిశ్రాంతంగా కృషి చేయాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com