గాజాలో 8,000 మంది మరణించారు.. వారందరూ హమాస్ కాదు: యూఏఈ
- October 31, 2023
యూఏఈ: గాజాలో తక్షణ కాల్పుల విరమణ చేపట్టాలని యూఏఈ మరోసారి పిలుపునిచ్చింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో యూఏఈ ప్రతినిధి ప్రసంగించారు. ఇజ్రాయెల్ వారాంతంలో గాజాలో తన భూతల కార్యకలాపాలను ప్రారంభించడంతో యూఏఈ, చైనా అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చిన తర్వాత UN భద్రతా మండలి సోమవారం సమావేశమైంది. మంగళవారం కూడా అత్యవసర సమావేశం కొనసాగుతుంది. హమాస్ అక్టోబర్ 7న చేపట్టిన దాడులపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పాలస్తీనా పౌరులు మూల్యం చెల్లిస్తున్నారని UNలో యూఏఈ శాశ్వత ప్రతినిధి లానా నుస్సీబే అన్నారు. "గాజాలో మరణించిన 8,000 మందికి పైగా ప్రజలు … వీరిలో 70 శాతం మంది మహిళలు, పిల్లలు, ఖచ్చితంగా అందరూ హమాస్ కాదు" అని ఎమిరాటీ రాయబారి చెప్పారు. “దాదాపు 1,000 మంది పిల్లలు తప్పిపోయారు. శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండవచ్చు లేదా చనిపోవచ్చు. వారు కూడా హమాస్ కాదు. వారికి మమ్మల్ని సహాయం చేయనిస్తారా?" అని ప్రశ్నించారు. గాజాకు ఇప్పుడు కాల్పుల విరమణ అవసరం అని ఆమె పేర్కొన్నారు. "మానవతా సహాయం ఇప్పుడు గాజాకు చేరుకునేలా చూడాలి. విద్యుత్తు, స్వచ్ఛమైన నీరు, ఇంధన సరఫరాకు దారులను పునరుద్ధరించాలి.’’ అని ఆమె డిమాండ్ చేశారు. గాజాలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రాలపై 76 దాడులు జరిగాయని, 20 ఆసుపత్రులు మరియు క్లినిక్లు దెబ్బతిన్నాయి లేదా ధ్వంసమయ్యాయని రాయబారి తెలిపారు. శుక్రవారం UN జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని ఆమె ప్రస్తావించారు. దీనిలో 121 దేశాలు గాజాలో తక్షణ మానవతా సహాయం కోసం స్పష్టమైన పిలుపునిచ్చాయని గుర్తుచేశారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







