అబుదాబి విమానాశ్రయానికి షేక్ జాయెద్ పేరు
- November 01, 2023
యూఏఈ: అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయానికి దివంగత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ పేరు పెట్టనున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అధికారికంగా జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. పేరు మార్పు ఫిబ్రవరి 9, 2024 నుండి అమల్లోకి వస్తుంది. కొత్త టెర్మినల్ నుంచి ఎతిహాద్ ఎయిర్వేస్ మంగళవారం భారతదేశానికి తొలి వాణిజ్య విమానాన్ని నడిపింది. అలాగే అబుదాబి నుండి న్యూఢిల్లీకి EY224 విమానం 359 మంది ప్రయాణికులతో మధ్యాహ్నం 2.35 గంటలకు టెర్మినల్ A నుండి బయలుదేరింది. నవంబర్ 14 నుండి అన్ని విమానయాన సంస్థలు టెర్మినల్ A నుండి ప్రత్యేకంగా పనిచేస్తాయి.ఎతిహాద్ నవంబర్ 9 నుండి దశలవారీగా టెర్మినల్ A కి విమానాలను మారుస్తుంది. నవంబర్ 9 - 14 మధ్య ఎయిర్లైన్ టెర్మినల్స్ - 3 నుండి నడుస్తుంది. నవంబర్ 14 ఉదయం 11 గంటల నుండి, క్యారియర్ కొత్త హబ్ నుండి అన్ని విమానాలను నడుపుతుంది. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మంగళవారం టెర్మినల్ను సందర్శించారు.
తాజా వార్తలు
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- ఒమన్ లో ప్లాస్టిక్ పై నిషేధం..జూలై 1 నుండి ఐదవ దశ ప్రారంభం..!!
- సముద్రయానం ముప్పు..సౌదీ, ఈజిప్ట్, ఖతార్ చర్చలు..!!
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక







