తక్షణ సహాయం కోసం శ్రీలంక అభ్యర్థన
- May 24, 2016
దుబాయ్లోని శ్రీలంక కాన్సులేట్ జనరల్, వలసదారులు మరియు ఇతర యూఏఈ నివాసితులకు విజ్ఞప్తి చేస్తోంది. ఇటీవల సంభవించిన వరదలతో తల్లడిల్లుతున్న శ్రీలంకను ఆదుకోవాల్సిందిగా శ్రీలంక కోరుతోంది. 103,776 కుటుంబాలు, 425,601 మంది ప్రజలు శ్రీలంకలో సంభవించిన వరదల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. వరదల కారణంగా 68 మంది మృత్యువాత పడ్డారు. ఈ పరిస్థితుల్లో విదేశాల్లోని శ్రీలంకకు చెందినవారే కాకుండా ఇతరులూ తమను ఆదుకోవాల్సిందిగా శ్రీలంక ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కాన్సులేట్ జనరల్ వద్ద డొనేషన్లను ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీసుకోబడతాయనీ, శని, ఆదివారాల్లో మాత్రం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డొనేషన్ల స్వీకరణ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. వరదలతో దెబ్బతిన్న శ్రీలంకను ఆదుకునేందుకు పలువురు శ్రీలంక జాతీయులతోపాటు, యూఏఈలోని ఇతర దేశస్తులూ ముందుకు వస్తారని శ్రీలంక ఆశిస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







