తక్షణ సహాయం కోసం శ్రీలంక అభ్యర్థన

- May 24, 2016 , by Maagulf
తక్షణ సహాయం కోసం శ్రీలంక అభ్యర్థన

దుబాయ్‌లోని శ్రీలంక కాన్సులేట్‌ జనరల్‌, వలసదారులు మరియు ఇతర యూఏఈ నివాసితులకు విజ్ఞప్తి చేస్తోంది. ఇటీవల సంభవించిన వరదలతో తల్లడిల్లుతున్న శ్రీలంకను ఆదుకోవాల్సిందిగా శ్రీలంక కోరుతోంది. 103,776 కుటుంబాలు, 425,601 మంది ప్రజలు శ్రీలంకలో సంభవించిన వరదల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. వరదల కారణంగా 68 మంది మృత్యువాత పడ్డారు. ఈ పరిస్థితుల్లో విదేశాల్లోని శ్రీలంకకు చెందినవారే కాకుండా ఇతరులూ తమను ఆదుకోవాల్సిందిగా శ్రీలంక ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కాన్సులేట్‌ జనరల్‌ వద్ద డొనేషన్లను ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీసుకోబడతాయనీ, శని, ఆదివారాల్లో మాత్రం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డొనేషన్ల స్వీకరణ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. వరదలతో దెబ్బతిన్న శ్రీలంకను ఆదుకునేందుకు పలువురు శ్రీలంక జాతీయులతోపాటు, యూఏఈలోని ఇతర దేశస్తులూ ముందుకు వస్తారని శ్రీలంక ఆశిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com