షార్జా మునిసిపాలిటీ ఇంకా స్మార్ట్గా
- May 24, 2016
షార్జా మునిసిపాలిటీ, ఇన్స్పెక్షన్ ఆపరేషన్స్ అండ్ కస్టమర్ సర్వీసెసస్ బిల్డింగ్ సోమవారం ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రారంభమైంది. ఈ కొత్త బిల్డింగ్ 2,800 మీటర్ల వైశాల్యంలో ఉంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇందులో వినియోగించారు. మున్సిపల్ కైరిఔన్సిల్ ఛైర్మన్ రషీద్ బిన్ తలైహా, షార్జా మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా అయ్లాన్ ఈ భవనాన్ని ప్రారంభించారు. మునిసిపాలిటీ సాధించిన విజయాలకు ప్రతీకగా ఈ భవనాన్ని నిర్మించామని రియాద్ అల్ ఎలాన్ చెప్పారు. షార్జా మునిసిపాలిటీ ప్రజలకు అందిస్తున్న సేవల్ని ఇంకా మెరుగ్గా, స్మార్ట్గా మార్చడానికి ప్రయత్నిస్తోందని అన్నారాయన. వినియోగదారుల, ప్రజల విలువైన సమయాన్ని తగ్గించేందుకు మునిసిపాలిటీ టెక్నాలజీని సమర్థవంతంగా వాడుతోందని అధికారులు చెప్పారు. మునిసిపాలిటీ అధికారిక వెబ్సైట్ని అప్గ్రేడ్ చేసిన అనంతరం దాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అప్గ్రేడ్ చేయబడిన వెర్షన్, పబ్లిక్తో మరింత మెరుగైన కమ్యూనికేషన్ని కలిగి ఉంటుందని చెప్పారు. పర్మిషన్లు, లైసెన్సులను ఎలక్ట్రానిక్ పద్దతిలో మంజూరు చేయడానికి ఈ వెబ్సైట్ ఉపయుక్తంగా ఉంటుంది. ఇన్స్పెక్షన్ ఆపరేషన్ డైరెక్టర్ ఒమర్ అల్ షర్జి మాట్లాడుతూ, కొత్త బిల్డింగ్లో 71 సర్వీసులు అందుబాటులో ఉంటాయనీ, టెనెన్సీ రెగ్యులేషన్ డిపార్ట్మెంట్, పార్కింగ్ డిపార్ట్మెంట్, ఇన్స్పెక్షన్ ఆపరేషన్ మరియు ఇతర డిపార్ట్మెంట్లు ఇందులో కొలువుదీరాయని చెప్పారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







