ఈనెల 5న దుబాయ్ లో ‘దీపావళి ఉత్సవ్-2023’..
- November 02, 2023
దుబాయ్: సర్వో దీపావళి ఉత్సవ్-2023ని జరుపుకునేందుకు దుబాయ్ సిద్ధమైంది. ఈ ఏడాది వేడుకల్లో ఇండియన్ బాలీవుడ్ సూపర్ స్టార్ జాన్ అబ్రహం, స్టీఫెన్ దేవస్సీ లు ప్రధాన ఆకర్షణగా నిల్వనున్నారు. గతేడాది ఎటిసలాత్ అకాడమీలో నిర్వహించిన దీపావళి ఉత్సవ్ వేడుకలు విజయవంతమైన నేపథ్యంలో ఈ ఏదాడి ‘సర్వో దీపావళి ఉత్సవ్-2023’ని ప్రకటించారు నిర్వాహకులు. ఇది నవంబర్ 5న (ఆదివారం) సాయంత్రం 04.00 నుండి 10.00 గంటల వరకు దుబాయ్ లోని ఈటీమియాస్లో నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం FOI కేంద్ర థీమ్ 'భిన్నత్వంలో ఏకత్వం(యూనిటీ ఇన్ డైవర్సిటీ)'గా ప్రకటించింది. ఈ ఈవెంట్కు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా మద్దతు ఇస్తుండగా.. దుబాయ్లోని ఎటిసలాట్ అకాడమీలో హిస్ ఎక్సలెన్సీ కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా, FOI నుండి ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ ఏడాది రంగోలి పోటీ (భారత జానపద-కళా రూపం), సాంప్రదాయ భారతీయ ఆటలు ఆకట్టుకోనున్నాయి. భారతదేశంలోని విభిన్న సంస్కృతులను ప్రదర్శించేందుకు 15 కంటే ఎక్కువ భారతీయ రాష్ట్రాల నుండి ఒక ప్రత్యేకమైన జానపద నృత్య బృందాలు వస్తున్నాయి. అలాగే భారతదేశంలోని వివిధ రాష్ట్రాల వంటకాలను సూచించే ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఈవెంట్కు వచ్చే సందర్శకులు వేదిక వద్ద ఎంట్రీ టిక్కెట్ను కొనుగోలు చేయాలి. టికెట్ వివరాల కోసం (వెబ్సైట్: www.foieventsllc.com / Facebook పేజీ: FOIEvents) లేదా +971 54 996 7563 / +971 52 607 9529 ను సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలియజేశారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







