యాపిల్ వినియోగదారులకు అలెర్ట్
- November 03, 2023
యూఏఈ: యాపిల్ సపోర్ట్ నుండి వచ్చిన ఫేక్ టెక్స్ట్ మెసేజ్లకు వ్యతిరేకంగా యూఏఈ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఫిషింగ్ క్యాంపెయిన్ హెచ్చరిక జారీ చేసింది. యాపిల్ ఖాతా మూసివేయబడిందని లేదా తాత్కాలికంగా నిలిపివేయబడిందని క్లెయిమ్ చేసే చిన్న SMS సందేశాలను ఉపయోగించి ఫిషింగ్ జరుగుతుందని తెలిపింది. ఈ సందేశాలు ఖాతాకు లింక్ చేయబడిన ఫోన్ నంబర్, లేదా లింక్ లను ఓపెన్ చేయవద్దని సూచించింది. మెసేజ్లో అందించిన లింక్పై క్లిక్ చేసి, వారి యూజర్ ఆధారాలను అందజేయాలని కోరతారని, అలా చేస్తే స్కామర్లు వ్యక్తిగత డేటాను దొంగిలిస్తారని తెలిపారు. ఈ మెసేజ్లకు ప్రతిస్పందించడం లేదా అలాంటి లింక్లపై క్లిక్ చేయడం మానుకోవాలని అధికార నివాసితులను కోరింది.
స్కామ్ల బారిన పడకుండా కొన్ని టిప్స్ ను నిపుణులు సూచించారు. సందేశంలో అందించిన ఏదైనా నంబర్లను సంప్రదించవద్దు. తెలియని మూలాల నుండి వచ్చే సందేశాలలోని లింక్లపై క్లిక్ చేయవద్దు. మీ పరికరం మరియు యాప్లను స్థిరంగా అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇలాంటి సందేశాలకు ప్రతిస్పందించవద్దు. మీ రహస్య సమాచారాన్ని ఎప్పుడూ ఎవరికి తెలపవద్దు. మీ డేటాను క్రమం తప్పకుండా బ్యాకప్ చేసుకోవాలి. వ్యక్తిగత సమాచారాన్ని అభ్యర్థించే వచన సందేశాలను స్వీకరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి మోసాలకు సంబంధించిన సమాచారం ఉంటే యూఏఈ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్కి తెలియజేయాలని సూచించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







