యాపిల్ వినియోగదారులకు అలెర్ట్
- November 03, 2023
యూఏఈ: యాపిల్ సపోర్ట్ నుండి వచ్చిన ఫేక్ టెక్స్ట్ మెసేజ్లకు వ్యతిరేకంగా యూఏఈ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఫిషింగ్ క్యాంపెయిన్ హెచ్చరిక జారీ చేసింది. యాపిల్ ఖాతా మూసివేయబడిందని లేదా తాత్కాలికంగా నిలిపివేయబడిందని క్లెయిమ్ చేసే చిన్న SMS సందేశాలను ఉపయోగించి ఫిషింగ్ జరుగుతుందని తెలిపింది. ఈ సందేశాలు ఖాతాకు లింక్ చేయబడిన ఫోన్ నంబర్, లేదా లింక్ లను ఓపెన్ చేయవద్దని సూచించింది. మెసేజ్లో అందించిన లింక్పై క్లిక్ చేసి, వారి యూజర్ ఆధారాలను అందజేయాలని కోరతారని, అలా చేస్తే స్కామర్లు వ్యక్తిగత డేటాను దొంగిలిస్తారని తెలిపారు. ఈ మెసేజ్లకు ప్రతిస్పందించడం లేదా అలాంటి లింక్లపై క్లిక్ చేయడం మానుకోవాలని అధికార నివాసితులను కోరింది.
స్కామ్ల బారిన పడకుండా కొన్ని టిప్స్ ను నిపుణులు సూచించారు. సందేశంలో అందించిన ఏదైనా నంబర్లను సంప్రదించవద్దు. తెలియని మూలాల నుండి వచ్చే సందేశాలలోని లింక్లపై క్లిక్ చేయవద్దు. మీ పరికరం మరియు యాప్లను స్థిరంగా అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇలాంటి సందేశాలకు ప్రతిస్పందించవద్దు. మీ రహస్య సమాచారాన్ని ఎప్పుడూ ఎవరికి తెలపవద్దు. మీ డేటాను క్రమం తప్పకుండా బ్యాకప్ చేసుకోవాలి. వ్యక్తిగత సమాచారాన్ని అభ్యర్థించే వచన సందేశాలను స్వీకరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి మోసాలకు సంబంధించిన సమాచారం ఉంటే యూఏఈ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్కి తెలియజేయాలని సూచించారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







