దుబాయ్ లో పాస్పోర్ట్లపై ప్రత్యేక స్టాంప్
- November 03, 2023
దుబాయ్: నవంబర్ 6 నుండి 18 వరకు దుబాయ్ విమానాశ్రయాలకు చేరుకునే ప్రయాణికులు వారి పాస్పోర్ట్లపై ప్రత్యేక స్టాంప్ పొందుతారని గురువారం ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ Xలో దుబాయ్ ఎయిర్పోర్ట్స్ స్మారక స్టాంప్ను విడుదల చేసింది. ఇది దుబాయ్ ఎయిర్షో కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (DXB) లేదా దుబాయ్ వరల్డ్ సెంట్రల్ (DWC) ద్వారా ప్రయాణించినా, ప్రయాణీకులందికి ఈ ప్రత్యేక స్టాంపింగ్ చేయనున్నారు. దుబాయ్ ఎయిర్షో 18వ ఎడిషన్ విమానయాన, అంతరిక్ష రంగంలోని తాజా ఆవిష్కరణలు,ఉత్పత్తుల శ్రేణిని ప్రదర్శిస్తుంది. దుబాయ్ వరల్డ్ సెంట్రల్ (డిడబ్ల్యుసి)లో నవంబర్ 13 నుండి 17 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్ కు 95 దేశాల నుండి 1,400 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. 180కి పైగా అత్యాధునిక వాణిజ్య, ప్రైవేట్, సైనిక విమానాలు ప్రదర్శనలో కొలువుదీరనున్నాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







