దుబాయ్ లో పాస్పోర్ట్లపై ప్రత్యేక స్టాంప్
- November 03, 2023
దుబాయ్: నవంబర్ 6 నుండి 18 వరకు దుబాయ్ విమానాశ్రయాలకు చేరుకునే ప్రయాణికులు వారి పాస్పోర్ట్లపై ప్రత్యేక స్టాంప్ పొందుతారని గురువారం ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ Xలో దుబాయ్ ఎయిర్పోర్ట్స్ స్మారక స్టాంప్ను విడుదల చేసింది. ఇది దుబాయ్ ఎయిర్షో కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (DXB) లేదా దుబాయ్ వరల్డ్ సెంట్రల్ (DWC) ద్వారా ప్రయాణించినా, ప్రయాణీకులందికి ఈ ప్రత్యేక స్టాంపింగ్ చేయనున్నారు. దుబాయ్ ఎయిర్షో 18వ ఎడిషన్ విమానయాన, అంతరిక్ష రంగంలోని తాజా ఆవిష్కరణలు,ఉత్పత్తుల శ్రేణిని ప్రదర్శిస్తుంది. దుబాయ్ వరల్డ్ సెంట్రల్ (డిడబ్ల్యుసి)లో నవంబర్ 13 నుండి 17 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్ కు 95 దేశాల నుండి 1,400 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. 180కి పైగా అత్యాధునిక వాణిజ్య, ప్రైవేట్, సైనిక విమానాలు ప్రదర్శనలో కొలువుదీరనున్నాయి.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







