దుబాయ్ లో పాస్పోర్ట్లపై ప్రత్యేక స్టాంప్
- November 03, 2023
దుబాయ్: నవంబర్ 6 నుండి 18 వరకు దుబాయ్ విమానాశ్రయాలకు చేరుకునే ప్రయాణికులు వారి పాస్పోర్ట్లపై ప్రత్యేక స్టాంప్ పొందుతారని గురువారం ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ Xలో దుబాయ్ ఎయిర్పోర్ట్స్ స్మారక స్టాంప్ను విడుదల చేసింది. ఇది దుబాయ్ ఎయిర్షో కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (DXB) లేదా దుబాయ్ వరల్డ్ సెంట్రల్ (DWC) ద్వారా ప్రయాణించినా, ప్రయాణీకులందికి ఈ ప్రత్యేక స్టాంపింగ్ చేయనున్నారు. దుబాయ్ ఎయిర్షో 18వ ఎడిషన్ విమానయాన, అంతరిక్ష రంగంలోని తాజా ఆవిష్కరణలు,ఉత్పత్తుల శ్రేణిని ప్రదర్శిస్తుంది. దుబాయ్ వరల్డ్ సెంట్రల్ (డిడబ్ల్యుసి)లో నవంబర్ 13 నుండి 17 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్ కు 95 దేశాల నుండి 1,400 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. 180కి పైగా అత్యాధునిక వాణిజ్య, ప్రైవేట్, సైనిక విమానాలు ప్రదర్శనలో కొలువుదీరనున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









