లండన్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ
- November 03, 2023లండన్: ప్రపంచ దేశాల్లో మొట్ట మొదటిసారిగా లండన్లో తెలంగాణ ఎన్నారైలు, తెలంగాణ సంఘాలు ఐక్యంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్నికల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. కల్వకుంట్ల కవిత తన ప్రారంభోపన్యాసంలో తెలంగాణ ప్రవాసుల మధ్య సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, ఐక్యతను పెంపొందించడం ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. కమ్యూనిటీ సంస్థల సంస్కృతి, భాష, సేవా కార్యక్రమాలని ప్రశంసిస్తూ, లండన్ విభిన్న బహుళ సాంస్కృతిని ఆలింగనం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ తమమూలాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ తల్లి విగ్రహం ఇంగ్లండ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ సమాజానికి ఐక్యత, శక్తికి చిహ్నంగా నిలుస్తుందని అన్నారు. ఇది మన భాగస్వామ్య వారసత్వం, సమాజంగా మనల్ని బంధించే విలువలను గుర్తుచేస్తూ, స్ఫూర్తిదాయకమైన దీపస్తంభంగా పనిచేస్తుందని తెలిపారు. ప్రపంచ తెలంగాణ సమాజానికి గర్వకారణం మరియు వారసత్వ చిహ్నమైన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించడం పట్ల తాము సంతోషిస్తున్నామని తెలంగాణ ప్రజా సంఘాల నేతలు అన్నారు. ఇది తెలంగాణ సాంస్కృతిక వారసత్వంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొన్నారు. కల్వకుంట్ల కవిత తన మాటలతో అందరిలో స్ఫూర్తి నింపినందుకు సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, నాయకులు కిశోరె మున్నాగాల, దన్నంనేని సంపత్ కృష్ణ, సుమన్ బలమూరి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు