లండన్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ
- November 03, 2023
లండన్: ప్రపంచ దేశాల్లో మొట్ట మొదటిసారిగా లండన్లో తెలంగాణ ఎన్నారైలు, తెలంగాణ సంఘాలు ఐక్యంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్నికల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. కల్వకుంట్ల కవిత తన ప్రారంభోపన్యాసంలో తెలంగాణ ప్రవాసుల మధ్య సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, ఐక్యతను పెంపొందించడం ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. కమ్యూనిటీ సంస్థల సంస్కృతి, భాష, సేవా కార్యక్రమాలని ప్రశంసిస్తూ, లండన్ విభిన్న బహుళ సాంస్కృతిని ఆలింగనం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ తమమూలాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ తల్లి విగ్రహం ఇంగ్లండ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ సమాజానికి ఐక్యత, శక్తికి చిహ్నంగా నిలుస్తుందని అన్నారు. ఇది మన భాగస్వామ్య వారసత్వం, సమాజంగా మనల్ని బంధించే విలువలను గుర్తుచేస్తూ, స్ఫూర్తిదాయకమైన దీపస్తంభంగా పనిచేస్తుందని తెలిపారు. ప్రపంచ తెలంగాణ సమాజానికి గర్వకారణం మరియు వారసత్వ చిహ్నమైన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించడం పట్ల తాము సంతోషిస్తున్నామని తెలంగాణ ప్రజా సంఘాల నేతలు అన్నారు. ఇది తెలంగాణ సాంస్కృతిక వారసత్వంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొన్నారు. కల్వకుంట్ల కవిత తన మాటలతో అందరిలో స్ఫూర్తి నింపినందుకు సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, నాయకులు కిశోరె మున్నాగాల, దన్నంనేని సంపత్ కృష్ణ, సుమన్ బలమూరి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత







