బహ్రెయిన్ -ఇజ్రాయెల్ మధ్య తెగిన దౌత్య సంబంధాలు..!
- November 03, 2023
బహ్రెయిన్ : ఇజ్రాయెల్లోని గల్ఫ్ స్టేట్ రాయబారి స్వదేశానికి తిరిగి వచ్చారని, మనామాలోని ఇజ్రాయెల్ రాయబారి రాజ్యాన్ని విడిచిపెట్టారని బహ్రెయిన్ గురువారం తెలిపింది. ఇజ్రాయెల్-హమాస్ సంఘర్షణ నేపథ్యంలో బహ్రెయిన్ పార్లమెంట్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. హమాస్తో జరిగిన యుద్ధంలో గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ బాంబుల దాడి చేయడం వల్ల వేలాది మంది ప్రజలు మరణించారని పేర్కొంది. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులను నిలిపివేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అదే సమయంలో బహ్రెయిన్ లోని ఇజ్రాయెల్ రాయబారి బహిష్కరించబడ్డారా లేదా అతనే వెళ్లిపోయాడా అనే విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు బహ్రెయిన్తో తమ సంబంధాలు "స్థిరమైనవి" అని, అటువంటి చర్యల గురించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఇజ్రాయెల్ చెప్పింది. అంతకుముందు బహ్రెయిన్ రాజ్యంలోని ఇజ్రాయెల్ రాయబారి బహ్రెయిన్ను విడిచిపెట్టినట్లు ప్రతినిధుల మండలి ధృవీకరించింది. అలాగే ఇజ్రాయెల్లో ని బహ్రెయిన్ రాయబారి తిరిగి రావాలని బహ్రెయిన్ పార్లమెంటు ఆదేశించింది. గాజా ఆరోగ్య అధికారుల ప్రకారం.. 2.3 మిలియన్ల జనాభా కలిగిన చిన్న పాలస్తీనా ఎన్క్లేవ్పై ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడిలో 3,760 మంది పిల్లలతో సహా కనీసం 9,601 మంది మరణించారు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









