సౌదీ అరేబియాలో 1,698 మంది అవయవ దాతలు
- November 03, 2023
రియాద్: సౌదీ అరేబియాలో 2022లో అవయవ దాతల సంఖ్య 1,698కి చేరుకుంది. వారిలో ఎక్కువ మంది కిడ్నీ దాతలున్నారని సౌదీ సెంటర్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ (SCOT) వెల్లడించింది. 1,022 మంది జీవించి ఉన్న దాతలు, 138 మంది బ్రెయిన్ డెడ్ దాతలు దానం చేసిన అవయవాలతో నిరుపేద రోగులకు మూత్రపిండ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. 374 మంది జీవించి ఉన్న దాతలు, 66 మంది బ్రెయిన్ డెడ్ దాతల అవయవాలతో కాలేయ మార్పిడి చికిత్సలు నిర్వహించినట్లు SCOT పేర్కొంది. గుండె మార్పిడి కోసం 41 మంది బ్రెయిన్ డెడ్ దాతలు, ఊపిరితిత్తుల రోగుల ప్రాణాలను కాపాడేందుకు 38 మంది బ్రెయిన్ డెడ్ డోనర్లు ముందుకొచ్చినట్లు కేంద్రం పేర్కొంది. SCOT యొక్క రికార్డుల ప్రకారం.. 41 మంది బ్రెయిన్ డెడ్ వ్యక్తుల విరాళాల ద్వారా ప్యాంక్రియాస్ మార్పిడి జరిగింది. ఐదుగురు బ్రెయిన్ డెడ్ వ్యక్తులు పేగులను దానం చేశారు. సౌదీ అరేబియాలోని మానవ అవయవ దాన చట్టం ప్రకారం.. ఇస్లామిక్ షరియా చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఒక వ్యక్తి తన అవయవాలలో ఏదైనా అవయవాన్ని దానం చేయడం కోసం సిఫార్సు చేయడానికి అనుమతి ఉంది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







