ఐపీఎల్ పై సౌదీ అరేబియా కన్ను..!
- November 03, 2023
సౌదీ అరేబియా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2008లో ప్రారంభమైన ఈ లీగ్ విజయవంతంగా 16 సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రపంచంలోనే అత్యధిక ధనిక లీగుల్లో ఒకటిగా నిలిచింది. ఏటా వేల కోట్ల రూపాయలు ఐపీఎల్ ద్వారా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ఆర్జిస్తోంది. స్పాన్సర్ షిప్స్, మీడియా హక్కులు తదితరాల ద్వారా బీసీసీఐకి ఆదాయం వస్తుంది. ఇక క్రికెట్ ఆడే ప్రతి ఒక్కరు ఒక్కసారైనా ఐపీఎల్లో ఆడితే చాలు అని అనుకుంటారు అనడంలో అతి శయోక్తి లేదు. ఒక్క సారి ఐపీఎల్లో సత్తా చాటితే కోట్ల రూపాయలను సంపాదన వస్తుండడమే అందుకు కారణం.
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ పై సౌదీ అరేబియా కన్నేసింది. మల్టీ బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టి వాటాను కొనుగోలు చేసేందుకు సిధ్ధంగా ఉన్నట్లు బ్లూమ్బెర్గ్ న్యూస్ శుక్రవారం వెల్లడించింది. ఫుట్బాల్, గోల్ఫ్తో పాటు చాలా లీగుల్లో వాటాలు దక్కించుకున్న సౌదీ తాజాగా క్రికెట్లోనూ పాగా వేయాలని ప్రణాళికలు రచించింది. ఇప్పటికే ఈ విషయమై సౌదీ అరేబియా ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ సలహాదారులు భారత ప్రభుత్వ అధికారులతో చర్చించారట.
ఐపీఎల్ను దాదాపు 30 బిలియన్ డాలర్ల విలువైన హోల్డింగ్ కంపెనీగా మార్చడం గురించి చర్చించారని నివేదిక తెలిపింది. సెప్టెంబరులో యువరాజు భారతదేశాన్ని సందర్శించినప్పుడు ఈ చర్చలు జరిగినట్లు వెల్లడించారు. ఐపీఎల్ లీగ్లో 5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని, ఆ తరువాత క్రమంగా దాన్ని ఇతర దేశాలకు విస్తరించే ప్రతిపాదన పై కూడా చర్చలు జరిగాయని, బీసీసీఐ అనుమతి కోసం వెయిట్ చేస్తున్నట్లుగా నివేదిక పేర్కొంది.
ఇదిలా ఉంటే.. గత సంవత్సరం ఐపీఎల్ ప్రసార హక్కులు 6.2 బిలియన్ డాలర్లకు అమ్ముడైన విషయం తెలిసిందే. అంటే ఒక్కో మ్యాచ్కు 15.1 మిలియన్ డాలర్లు . ఇది ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ కంటే ఎక్కువ అయినప్పటికీ యూఎస్ నేషనల్ ఫుట్బాల్ లీగ్ కంటే కాస్త తక్కువ. అందుకే ఇప్పుడు సౌదీ కన్ను ఐపీఎల్ పై పడినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







