గాజాలో ప్రజలపై మారణహోమం.. అరబ్ ఆరోగ్య మంత్రులు ఆందోళన

- November 04, 2023 , by Maagulf
గాజాలో ప్రజలపై మారణహోమం.. అరబ్ ఆరోగ్య మంత్రులు ఆందోళన

మస్కట్: గాజా స్ట్రిప్‌లో పాలస్తీనా ప్రజలపై మారణహోమం కొనసాగడం, చికిత్సా కేంద్రాలు మరియు ఆసుపత్రుల పరిసరాల్లో వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగించడం వంటి విపత్కర మానవతా మరియు ఆరోగ్య పరిణామాల గురించి అరబ్ ఆరోగ్య మంత్రుల మండలి హెచ్చరించింది.  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన అసాధారణ సెషన్ తరువాత గాజా స్ట్రిప్‌లోని ఆరోగ్యం, మానవతా పరిస్థితులకు సంబంధించి, గాజా స్ట్రిప్‌లో జీవన ప్రాథమిక అవసరాలపై నిరంతర ఆంక్షలు విధించడం గురించి కౌన్సిల్ ఈ రోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో హెచ్చరించింది. నీరు, మందులు, విద్యుత్, ఇంధన ప్రవేశం, ఇది పౌరులలో ప్రాణనష్టానికి దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తుంది.  గాజా స్ట్రిప్‌లో జరుగుతున్న యుద్ధ నేరాలు,  క్రూరమైన మారణకాండలను ఖండించారు. ఇజ్రాయెల్ దాడులలో ఇప్పటివరకు 8,720 మందికి పైగా పాలస్తీయన్లు మరణించగా.. 22,000 మందికి పైగా గాయపడ్డారు. ఈ క్రూరమైన మారణకాండలను ఆపడానికి అంతర్జాతీయ సమాజం ముందుకురావాలని పిలుపునిచ్చింది. పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న మానవతా విపత్తు భారాన్ని తగ్గించడానికి సురక్షితమైన, స్థిరమైన మానవతా కారిడార్‌లను తెరవాలని కోరారు. గాజా స్ట్రిప్‌ ముట్టడిని తక్షణం ఇజ్రాయెల్ ఆపాలని డిమాండ్ చేసింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com