గాజా స్ట్రిప్ నుండి ఆరుగురు పౌరులను రక్షించిన బహ్రెయిన్
- November 04, 2023
బహ్రెయిన్: ఆరుగురు బహ్రెయిన్ పౌరులను గాజా స్ట్రిప్ నుండి రఫా సరిహద్దు క్రాసింగ్ ద్వారా ఈజిప్టుకు బహ్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తరలించింది. క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఫాలో-అప్తో హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆదేశాలను ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని కాన్సులర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాల అండర్ సెక్రటరీ డా. మహమ్మద్ అలీ బహ్జాద్ ఆధ్వర్యంలో పౌరుల తరలింపు ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా రఫా సరిహద్దు క్రాసింగ్ ద్వారా తరలింపునకు సహాయం చేసిన ఈజిప్టు విదేశాంగ మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. పౌరులు సురక్షితంగా బహ్రెయిన్కు తిరిగి రావడానికి మంత్రిత్వ శాఖ అవసరమైన అన్ని చర్యలు తీసుకుందని డాక్టర్ బహ్జాద్ చెప్పారు. ఇంకా గాజాలోని చిక్కుకున్న బహ్రెయిన్ పౌరులు మంత్రిత్వ శాఖలోని ఫాలో-అప్ కార్యాలయాన్ని +973 17227 555లో సంప్రదించవచ్చని, లేదా జోర్డాన్లోని అమ్మన్లోని బహ్రెయిన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







