గాజా స్ట్రిప్ నుండి ఆరుగురు పౌరులను రక్షించిన బహ్రెయిన్
- November 04, 2023
బహ్రెయిన్: ఆరుగురు బహ్రెయిన్ పౌరులను గాజా స్ట్రిప్ నుండి రఫా సరిహద్దు క్రాసింగ్ ద్వారా ఈజిప్టుకు బహ్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తరలించింది. క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఫాలో-అప్తో హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆదేశాలను ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని కాన్సులర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాల అండర్ సెక్రటరీ డా. మహమ్మద్ అలీ బహ్జాద్ ఆధ్వర్యంలో పౌరుల తరలింపు ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా రఫా సరిహద్దు క్రాసింగ్ ద్వారా తరలింపునకు సహాయం చేసిన ఈజిప్టు విదేశాంగ మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. పౌరులు సురక్షితంగా బహ్రెయిన్కు తిరిగి రావడానికి మంత్రిత్వ శాఖ అవసరమైన అన్ని చర్యలు తీసుకుందని డాక్టర్ బహ్జాద్ చెప్పారు. ఇంకా గాజాలోని చిక్కుకున్న బహ్రెయిన్ పౌరులు మంత్రిత్వ శాఖలోని ఫాలో-అప్ కార్యాలయాన్ని +973 17227 555లో సంప్రదించవచ్చని, లేదా జోర్డాన్లోని అమ్మన్లోని బహ్రెయిన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







