గాజా ఇష్యు.. అమెరికా, అరబ్ నేతలు భేటీ
- November 04, 2023
యూఏఈ: గాజాలో పెరుగుతున్న యుద్ధం, క్షీణిస్తున్న మానవతా పరిస్థితిపై అరబ్ నేతలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై చర్చించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తో జోర్డాన్లో అరబ్ నాయకులు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ తక్షణం కాల్పుల విరమణ చేపట్టేలా ఒత్తిడి తేవాలని వారు డిమాండ్ చేయనున్నారు. శుక్రవారం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో బ్లింకెన్ సమావేశమయ్యారు. బందీలను విడిపించేందుకు, గాజాలోకి సహాయాన్ని అనుమతించే విషయంలో సహాయం చేస్తానని, కానీ ఇజ్రాయెల్ను నిరోధించలేమని ఆయన అన్నారు. మరోవైపు నెతన్యాహు బందీలను విడిపిస్తే తప్ప కాల్పుల విరమణ గురించి ఆలోచించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బ్లింకెన్.. శనివారం ఎమిరాటీ, సౌదీ, ఖతారీ మరియు ఈజిప్టు విదేశాంగ మంత్రులతో పాటు అమ్మాన్లో పాలస్తీనా ప్రతినిధులతో సమావేశమవుతారని జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా అంబులెన్స్పై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 15 మంది మరణించారని గాజా ఆరోగ్య అధికారులు తెలిపారు. కాగా, హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెట్ సైన్యం తెలిపింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







