గాజా ఇష్యు.. అమెరికా, అరబ్ నేతలు భేటీ
- November 04, 2023
యూఏఈ: గాజాలో పెరుగుతున్న యుద్ధం, క్షీణిస్తున్న మానవతా పరిస్థితిపై అరబ్ నేతలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై చర్చించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తో జోర్డాన్లో అరబ్ నాయకులు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ తక్షణం కాల్పుల విరమణ చేపట్టేలా ఒత్తిడి తేవాలని వారు డిమాండ్ చేయనున్నారు. శుక్రవారం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో బ్లింకెన్ సమావేశమయ్యారు. బందీలను విడిపించేందుకు, గాజాలోకి సహాయాన్ని అనుమతించే విషయంలో సహాయం చేస్తానని, కానీ ఇజ్రాయెల్ను నిరోధించలేమని ఆయన అన్నారు. మరోవైపు నెతన్యాహు బందీలను విడిపిస్తే తప్ప కాల్పుల విరమణ గురించి ఆలోచించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బ్లింకెన్.. శనివారం ఎమిరాటీ, సౌదీ, ఖతారీ మరియు ఈజిప్టు విదేశాంగ మంత్రులతో పాటు అమ్మాన్లో పాలస్తీనా ప్రతినిధులతో సమావేశమవుతారని జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా అంబులెన్స్పై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 15 మంది మరణించారని గాజా ఆరోగ్య అధికారులు తెలిపారు. కాగా, హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెట్ సైన్యం తెలిపింది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







