గాజాలోని జబాలియా క్యాంప్పై ఇజ్రాయెల్ దాడులు.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- November 04, 2023
జెనీవా: గాజా స్ట్రిప్లోని జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన అమానవీయ దాడులను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని, గాయపడ్డారని ఆందోళన వ్యక్తం చేసింది. జెనీవాలోని ఐక్యరాజ్యసమితిలో సౌదీ అరేబియా శాశ్వత మిషన్లో మానవ హక్కుల విభాగం అధిపతి ఆసియా బకోడా ఈ మేరకు ప్రకటించారు. సౌదీ అరేబియా కాల్పుల విరమణ, బందీల విడుదల, రక్తపాతాన్ని నిలిపివేయడం, మానవతా సహాయాన్ని అందించడం మరియు అంతర్జాతీయ ఒప్పందాలు మరియు చట్టాలకు కట్టుబడి ఉండాలనే పిలుపునిచ్చారు. అంతర్జాతీయ చట్టాలు, UN తీర్మానాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది. గత శుక్రవారం జారీ చేసిన UN జనరల్ అసెంబ్లీ తీర్మానం ప్రకారం తక్షణ కాల్పుల విరమణ, మానవతావాద సంధిని ఆమోదించాలని కోరింది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







