గాజాలోని జబాలియా క్యాంప్పై ఇజ్రాయెల్ దాడులు.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- November 04, 2023
జెనీవా: గాజా స్ట్రిప్లోని జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన అమానవీయ దాడులను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని, గాయపడ్డారని ఆందోళన వ్యక్తం చేసింది. జెనీవాలోని ఐక్యరాజ్యసమితిలో సౌదీ అరేబియా శాశ్వత మిషన్లో మానవ హక్కుల విభాగం అధిపతి ఆసియా బకోడా ఈ మేరకు ప్రకటించారు. సౌదీ అరేబియా కాల్పుల విరమణ, బందీల విడుదల, రక్తపాతాన్ని నిలిపివేయడం, మానవతా సహాయాన్ని అందించడం మరియు అంతర్జాతీయ ఒప్పందాలు మరియు చట్టాలకు కట్టుబడి ఉండాలనే పిలుపునిచ్చారు. అంతర్జాతీయ చట్టాలు, UN తీర్మానాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది. గత శుక్రవారం జారీ చేసిన UN జనరల్ అసెంబ్లీ తీర్మానం ప్రకారం తక్షణ కాల్పుల విరమణ, మానవతావాద సంధిని ఆమోదించాలని కోరింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







