గాజాలోని జబాలియా క్యాంప్పై ఇజ్రాయెల్ దాడులు.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- November 04, 2023
జెనీవా: గాజా స్ట్రిప్లోని జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన అమానవీయ దాడులను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని, గాయపడ్డారని ఆందోళన వ్యక్తం చేసింది. జెనీవాలోని ఐక్యరాజ్యసమితిలో సౌదీ అరేబియా శాశ్వత మిషన్లో మానవ హక్కుల విభాగం అధిపతి ఆసియా బకోడా ఈ మేరకు ప్రకటించారు. సౌదీ అరేబియా కాల్పుల విరమణ, బందీల విడుదల, రక్తపాతాన్ని నిలిపివేయడం, మానవతా సహాయాన్ని అందించడం మరియు అంతర్జాతీయ ఒప్పందాలు మరియు చట్టాలకు కట్టుబడి ఉండాలనే పిలుపునిచ్చారు. అంతర్జాతీయ చట్టాలు, UN తీర్మానాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది. గత శుక్రవారం జారీ చేసిన UN జనరల్ అసెంబ్లీ తీర్మానం ప్రకారం తక్షణ కాల్పుల విరమణ, మానవతావాద సంధిని ఆమోదించాలని కోరింది.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









