సౌతాఫ్రికా పై భారత్ ఘన విజయం
- November 05, 2023
కోల్ కతా: ప్రపంచ క్రికెట్ కప్ లో దక్షిణాఫ్రికా జట్టుపై భారత్ భారీ విజయం సాధించింది. భారత్ 327 పరుగుల లక్ష్యాన్ని పెట్టగా దక్షిణాఫ్రికా జట్టు 83 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో భారత్ 243 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో జరిగిన 37 వ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకుంది. భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటికే సెమీఫైనల్స్ లో బెర్త్ ను పొందాయి. రవీంద్ర జడేజా 5 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా జట్టును శాసించాడు. షమీ, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయగా, సిరాజ్ ఒక వికెట్ తీశాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







