'స్పైస్జెట్' వారి ఉచిత నీటి సరఫరా
- May 24, 2016
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్జెట్ ప్రజలకు తన సేవలను ప్రారంభించి 11 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మహారాష్ట్రలోని 11 నీటి ఎద్దడి గ్రామాలను ఆదుకోనుంది. ఓ ఎన్జీవోతో కలిసి మరఠ్వాడా ప్రాంతంలోని లాతూర్ జిల్లాలోని 11 ప్రాంతాలకు ఉచితంగా నీటిని సరఫరా చేయనుంది. 71,500 లీటర్లు నీటిని ప్రజలకు అందించనున్నట్లు విమానయాన సంస్థ అధికారులు వెల్లడించారు. స్పైస్జెట్ ప్రత్యేక నీటి ట్యాంకర్ల ద్వారా జూన్ 23 వరకు నీటిని సరఫరా చేస్తుంది.
మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కరవు ప్రాంతాలుగా 29వేల గ్రామాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో మరఠ్వాడా, విదర్భ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







