ఎలక్ట్రికల్ కేబుల్స్ చోరీ.. ఇద్దరు ఆసియన్లు అరెస్ట్
- November 07, 2023
కువైట్: ఎలక్ట్రికల్ కేబుల్స్ దొంగిలించే ఆసియా ప్రవాసుల ముఠాను జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. గత కొన్ని నెలల్లో జహ్రా గవర్నరేట్ పరిసర ఎడారి ప్రాంతాల్లో ఒక ముఠా ఎలక్ట్రికల్ కేబుళ్లను దొంగిలించిన సుమారు 30 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను అనుసరించేందుకు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం భద్రతా బృందాన్ని ఏర్పాటు చేసింది. అమ్ఘరా స్క్రాప్ షాపుల్లో ఇద్దరు ఆసియన్లు కొత్త మరియు ఉపయోగించిన ఎలక్ట్రికల్ కేబుళ్లను తరచుగా విక్రయిస్తున్నట్లు నివేదికలు రావడంతో.. బృందం నిందితులను పట్టుకోగలిగిందన్నారు. ఆర్థిక లబ్ధి కోసం విద్యుత్ స్తంభాలను లాగి పడేయడం, విద్యుత్ తీగలను కత్తిరించి విక్రయించడం వంటి పనులకు పాల్పడుతున్నట్లు విచారణలో నిందితులు అంగీకరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..