ఎలక్ట్రికల్ కేబుల్స్ చోరీ.. ఇద్దరు ఆసియన్లు అరెస్ట్
- November 07, 2023
కువైట్: ఎలక్ట్రికల్ కేబుల్స్ దొంగిలించే ఆసియా ప్రవాసుల ముఠాను జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. గత కొన్ని నెలల్లో జహ్రా గవర్నరేట్ పరిసర ఎడారి ప్రాంతాల్లో ఒక ముఠా ఎలక్ట్రికల్ కేబుళ్లను దొంగిలించిన సుమారు 30 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను అనుసరించేందుకు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం భద్రతా బృందాన్ని ఏర్పాటు చేసింది. అమ్ఘరా స్క్రాప్ షాపుల్లో ఇద్దరు ఆసియన్లు కొత్త మరియు ఉపయోగించిన ఎలక్ట్రికల్ కేబుళ్లను తరచుగా విక్రయిస్తున్నట్లు నివేదికలు రావడంతో.. బృందం నిందితులను పట్టుకోగలిగిందన్నారు. ఆర్థిక లబ్ధి కోసం విద్యుత్ స్తంభాలను లాగి పడేయడం, విద్యుత్ తీగలను కత్తిరించి విక్రయించడం వంటి పనులకు పాల్పడుతున్నట్లు విచారణలో నిందితులు అంగీకరించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!







