ఎలక్ట్రికల్ కేబుల్స్ చోరీ.. ఇద్దరు ఆసియన్లు అరెస్ట్
- November 07, 2023
కువైట్: ఎలక్ట్రికల్ కేబుల్స్ దొంగిలించే ఆసియా ప్రవాసుల ముఠాను జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. గత కొన్ని నెలల్లో జహ్రా గవర్నరేట్ పరిసర ఎడారి ప్రాంతాల్లో ఒక ముఠా ఎలక్ట్రికల్ కేబుళ్లను దొంగిలించిన సుమారు 30 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను అనుసరించేందుకు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం భద్రతా బృందాన్ని ఏర్పాటు చేసింది. అమ్ఘరా స్క్రాప్ షాపుల్లో ఇద్దరు ఆసియన్లు కొత్త మరియు ఉపయోగించిన ఎలక్ట్రికల్ కేబుళ్లను తరచుగా విక్రయిస్తున్నట్లు నివేదికలు రావడంతో.. బృందం నిందితులను పట్టుకోగలిగిందన్నారు. ఆర్థిక లబ్ధి కోసం విద్యుత్ స్తంభాలను లాగి పడేయడం, విద్యుత్ తీగలను కత్తిరించి విక్రయించడం వంటి పనులకు పాల్పడుతున్నట్లు విచారణలో నిందితులు అంగీకరించారు.
తాజా వార్తలు
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!
- ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు









