ఎలక్ట్రికల్ కేబుల్స్ చోరీ.. ఇద్దరు ఆసియన్లు అరెస్ట్
- November 07, 2023
కువైట్: ఎలక్ట్రికల్ కేబుల్స్ దొంగిలించే ఆసియా ప్రవాసుల ముఠాను జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. గత కొన్ని నెలల్లో జహ్రా గవర్నరేట్ పరిసర ఎడారి ప్రాంతాల్లో ఒక ముఠా ఎలక్ట్రికల్ కేబుళ్లను దొంగిలించిన సుమారు 30 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను అనుసరించేందుకు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం భద్రతా బృందాన్ని ఏర్పాటు చేసింది. అమ్ఘరా స్క్రాప్ షాపుల్లో ఇద్దరు ఆసియన్లు కొత్త మరియు ఉపయోగించిన ఎలక్ట్రికల్ కేబుళ్లను తరచుగా విక్రయిస్తున్నట్లు నివేదికలు రావడంతో.. బృందం నిందితులను పట్టుకోగలిగిందన్నారు. ఆర్థిక లబ్ధి కోసం విద్యుత్ స్తంభాలను లాగి పడేయడం, విద్యుత్ తీగలను కత్తిరించి విక్రయించడం వంటి పనులకు పాల్పడుతున్నట్లు విచారణలో నిందితులు అంగీకరించారు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







