లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 టికెట్ల విక్రయాలు ప్రారంభం..
- November 07, 2023
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 18 నుంచి డిసెంబర్ 9 వరకు భారత దేశంలోని ఐదు నగరాల్లో ఈ లీగ్ జరగనుంది. ఈ మ్యాచులకు సంబంధించిన టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. పేటీఎం, పేటీఎం ఇన్సైడర్లో టికెట్లను కొనుగోలు చేయవచ్చని లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC) ఓ ప్రకటనలో తెలిపింది.
లెజెండ్స్ లీగ్ క్రికెట్ CEO రామన్ రహేజా మాట్లాడుతూ.. భారతదేశంలోని ఐదు నగరాల్లో మ్యాచ్లు జరుగుతాయన్నారు. వైజాగ్, డెహ్రాడూన్, రాంచీ, జమ్మూ, సూరత్లలో మ్యాచ్లను షెడ్యూల్ చేసినట్లు వెల్లడించారు. ఈ సీజన్ అభిమానులను మరింతగా ఆకట్టుకుంటుందన్న ధీమాను వ్యక్తం చేశారు.
పేటీఎం ఇన్సైడర్ బిజినెస్ హెడ్ వరుణ్ ఖరే మాట్లాడుతూ.. గౌతమ్ గంభీర్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్, ఆరోన్ ఫించ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్, క్రిస్ గేల్, మార్టిన్ గుప్తిల్ వంటి క్రికెట్ దిగ్గజాల ఆటను ఈ టోర్నీ ద్వారా మరోసారి చూడొచ్చునని చెప్పారు. ఈ ఎడిషన్లో రెండు కొత్త ఫ్రాంచైజీలు సదరన్ సూపర్ స్టార్స్, అర్బన్రైజర్స్ హైదరాబాద్ వచ్చాయన్నారు. కొత్త జట్లతో కలిసి ఈ ఏడాది ఆరు జట్లు ఈ సీజన్లో ఆడతాయన్నారు. 22 రోజుల పాటు ఈ టోర్నీ అభిమానులను అలరిస్తుందని, మొత్తం 19 మ్యాచులు జరగనున్నాయన్నారు.
ఇక వైజాగ్లో డిసెంబర్ 2 నుండి డిసెంబర్ 4 వరకు మూడు మ్యాచులు జరగనున్నాయి. వైజాగ్లో జరిగే మ్యాచులు అన్ని Y.S.రాజశేఖర్ రెడ్డి ACA-VDCA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. మ్యాచ్ టికెట్ల ధర రూ.299 నుండి ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు
- మార్కాపురం బస్సు ప్రమాదం...అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
- టిప్పర్ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు..14 మంది సజీవదహనం
- అల్ జబల్ అల్ అఖ్దర్, రుస్తాక్ విలాయత్లలో భారీ వర్షాలు..!!
- ప్రాపర్టీ మార్కెట్ పతనంపై ఫేక్ న్యూస్ ను ఖండించిన దుబాయ్..!!
- వాయిదాలలో ఫోన్ల పేరిట ఫ్రాడ్..వ్యక్తి అరెస్టు..!!
- సాహ్ల్ యాప్ లో విమానయాన, ట్రావెల్ ఏజెన్సీల పై ఫిర్యాదులు..!!
- ఖతార్ లో స్కూల్ బస్సుల భద్రత పై మార్గదర్శకాలు జారీ..!!
- విజిట్ వీసాను ఫైన్ లేకుండా పొడిగింపునకు సౌదీ అనుమతి..!!
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..









